చట్టాన్ని అమలు పరచేందుకు 15 ఏళ్ళు చాలదా: సుప్రీం కోర్టు

కార్మికలోకం
వి.వి.ఎస్‌.మూర్తి
భవన తదితర నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమ బద్ధీకరణ చట్టాలను అమలు పరచడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలవైఫల్యాల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు మార్చి 15న సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. వారికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ ఎందుకు చేపట్టకూడదో తెలియజేయమని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ అధికారులను తదుపరి విచారణ రోజున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై, చట్టాన్ని అమలు జరపడంలో వారి వైఫల్యాలకు గల కారణాలను వివరించుకోవాలని తెలియజేసింది.
సుప్రీం కోర్టు- ఉత్తర ప్రదేశ్‌, జమ్మూ-కాశ్మీర్‌, అస్సాం తదితర రాష్ట్రాల కేసును ప్రస్తావిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు భవన తదితర నిర్మాణ కార్మికుల (ఉపాధి క్రమబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం, 1996ను అమలు జరపడంలో విఫలమయ్యాయి.
అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కోర్టు ధిక్కారణ కింద ఎందుకు చర్య తీసుకో కూడ కారణం చూపమని కోరుతూ వారికి నోటీసులు పం పించడం తప్ప కోర్టు ముందు మరో మార్గం లేదని తేల్చిచెప్పింది.
దేశ సర్వోన్నతన్యాయస్థానం పైన పేర్కొన్న చట్టం అమలుకు సంబంధించి జారీ చేసిన వివిధ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, వారి చట్టబద్ధమైన విధులను నెరవేర్చడంలో విఫలమైనాయని పేర్కొంది.
భవన, నిర్మాణ కార్మికుల చట్టాన్ని అమలు పర చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం (పిఐఎల్‌-పిల్‌) పై విచారణ జరుగుతోంది.
ఈ ఫిర్యాదును ఎన్‌జివో నిర్మాణ కార్మికుల జాతీయ ప్రచారోద్యమ కమిటీ ఫైల్‌ చేసింది. మహారాష్ట్ర, గోవా నాగాలాండ్‌, ఛత్తీస్‌ఘర్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాన్ని అమలు పరచడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తోంది. ఈ చట్టం అసంఘటిత నిర్మాణ కార్మికులను క్రమబద్ధీక రించేందుకు ఉద్దేశించబడింది.
ఈ చట్ట ప్రకారం ఆయా ప్రభుత్వాలు రిజిస్టరింగ్‌ అధికారులను నియమించాలి, ప్రతి యజమాని తమ సంస్థను రిజిస్టర్‌ చేయాల్సి ఉంది.
ఈ చట్ట ప్రకారం నిర్మాణ కార్మికులకు వివిధ ప్రయోజనాలు సమకూర్చాలి. కార్మికులు ఈ ప్రయోజ నాలను పొందేందుకు ప్రతీ రాష్ట్రం, రాష్ట్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ బోర్డుకు చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన వ్యక్తి ఉండగా, ఇతర సభ్యులుగా 15 మందికి మించకుండా రాష్ట్ర ప్రభు త్వం నియమించాల్సి ఉంది.
చట్ట ప్రకారం, సంక్షేమ బోర్డుల నేర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చేందుకు అధికారం కలిగిన కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోక పోవడం పట్ల సర్వోన్నతన్యాయస్థానం ఆందోళనను వ్యక్తం చేసింది. ఇది సెస్‌ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని కార్మిక ప్రయోజనాల కోసం వెచ్చించేందుకు అవ రోధంగా ఉందని కోర్టు పేర్కొంది. భవన తదితర నిర్మాణ కార్మికుల చట్టంలోని సెక్షన్‌ 60 కింద రాష్ట్రాలు బోర్డులనేర్పాటు చేయడంపై ప్రాథమిక చర్యలు కూడా కేంద్రం తీసుకోలేదని ఇంతకుముందు జరిగిన కేస్‌ హియరింగ్‌లలో (విచారణలలో) కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్‌జివోకు పిటీషనర్‌గా హాజరౌతున్న సీనియర్‌ అడ్వకేట్‌ కాలిన్‌ గొంజాల్వెజ్‌ తమిళనాడు, కేరళలు తప్ప ఇతర రాష్ట్రాలన్నీ చట్టాలను అమలు జరపడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు.
చట్టాలు చేసి 15 ఏళ్ళు గడుస్తున్నా, ఇటు కేంద్రం గాని, అటు రాష్ట్ర ప్రభుత్వాలుగాని, వాటిని అమలు జరిపిన దాఖలాలు లేవని పిఐఎల్‌ ఆరోపిస్తోంది.

సమాచార కమిషన్‌లో

సమాచార కమిషన్‌లో అదనపు కమిషనర్లను నియమించాలి

Thu, 24 Mar 2011, IST    vv Share  Buzz up!
కిరణ్‌కుమార్‌కు నారాయణ లేఖ
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లో అదనంగా కమిషనర్లను నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి సి.పి.ఐ. రాష్ట్ర సమితి కార్యదర్శి డా|| కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ యిలా వున్నది. సమాచార హక్కు చట్టం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయి నప్పటికీ నిజాయితీగా చెప్పుకోవాలంటే అది సంతృప్తికర స్థాయిలో లేదా ఆశించదగ్గ రీతిలో అమలుకు నోచుకోలే దన్నది మీకూ తెలిసిన విషయమే ! చట్టపు ఆచరణకు సంబంధించిన బలమంతా తగినంత మంది యోగ్యులైన కమిషనర్ల నియామకంపైనే అధారపడి ఉంటుందన్నారు. ఏ కారణాల వల్లనైతేనేమి గతంలో ఒక ప్రధాన కమి షనరు, ముగ్గురు కమిషనర్ల నియామకం మాత్రమే జరిగిందన్నారు. ఈ 6 సంవత్సరాల అనుభవం చెబు తున్న దాన్ని బట్టి సమాచార హక్కు చట్టం క్రింద సమా చారం కోరుతూ చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించే పని పౌర సమాచార అధికారుల స్థాయిలో సక్రమంగా అమలు జరగలేదన్నారు. ఆ నేపధ్యంలో కమిషన్‌కు వచ్చిన అప్పీళ్ళ పరిష్కారం కూడా తగినంత మంది కమి షనర్లు లేకపోవటం వల్ల విపరీతమైన జాప్యం జరు గుతూ నెలలే గాక సంవత్సరాల తరబడి అపరిష్కృతం గానే పడి ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అంతగా చైతన్యవంతంగాని ఈ దశలోనే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా, ఏ.ఎం.ఆర్‌ - అపార్డు ద్వారా ప్రభుత్వాధికారులకే గాక ప్రజలకూ అవగాహన కల్గించే కార్యక్రమాలు చేపట్టింది. ఈ రెండు సంస్థల యత్నాల వల్ల రాబోవు కాలంలో చైతన్యవంత మైన ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించు కోవడానికి పూనుకుంటారు. ఆ పరిస్థితిలో వారు కోరిన సమాచారాన్ని అందించడానికి గానీ, సమాచారాన్ని సక్రమంగా అందిచని వారిపై చర్యలు తీసుకోవడానికి తగినంత మంది కమిషనర్లు, వారికి సహకరించే సిబ్బంది, అనువైన సామాగ్రి లేకుండా సాధ్యపడదు. కనుక పూర్తి స్థాయిలో కమిషనర్ల నియామకం తప్పని సరిగా చేయవలసి ఉందన్నారు. ఇది జరగకుంటే కమిష నర్ల ముందుకు వచ్చే ఆప్పీళ్లు పెండింగ్‌ కేసులు మాదిరే తయారయ్యే ప్రమాదముందన్నారు.
అంతేగాక కమిషనర్ల ఎంపిక విషయంలో సమాచార హక్కు చట్టం నిర్ధేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వ్యక్తులను కమిషనర్లుగా నియమించక పోయినా, చట్టం ఆశిస్తున్న రీతిలో ప్రజలకు న్యాయం జరగదన్నారు. కనుక ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని చట్టం అవకాశం కల్పి స్తున్న మేరకు ప్రధాన కమిషనర్‌కు తోడుగా 10 మంది కమిషనర్లను నియమించ వలసిందిగా కోరారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో పదిమంది చొప్పును కమిషనర్ల నియామకం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన కంటే చిన్న రాష్రాలలో కూడా ఎక్కువ సంఖ్యలో కమిషనర్ల నియామకం జరిగి, సమాచార హక్కు చట్టం ఆదర్శప్రా యంగా అమలు జరుగుతున్నదన్నారు. ఈ దశలో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు కమిషనర్ల ఎంపిక జరగక పోవడం విచారకరమన్నారు. వెంటనే కమిషనర్ల ఎంపికతో పాటుగా కమిషన్‌లో తగినంత మంది సిబ్బందిని, సామాగ్రిని, వసతులను సమకూర్చవలసిం దిగా కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 26 లో చూపించిన విధంగా వీలైనంత ఎక్కువగా దాన్ని గురించి చేయవలసిన ప్రచారానికి వీలైనంత ఎక్కువగా నిధులను సమకూర్చాలని కోరారు.
సమాచారం అందక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు రెండవ అప్పీలు విషయంలో రాష్ట్ర రాజధానికి రావలసి రావడం పెను భారంగా మారిందన్నారు. అందుచేత రెండు లేక మూడు జిల్లాలకు ఒక కమిషనర్‌ చొప్పున ప్రాంతీయ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేసి చట్టం ప్రధానంగా ఉద్ధేశిస్తున్న పేద ప్రజలకు న్యాయం చేకూర్చవలసింనదిగా కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు నారాయణ విజ్ఞప్తి చేశారు.

ప్రతి కార్మికునికీ

ప్రతి కార్మికునికీ రూ.10 వేల జీతం ఇవ్వాలి

Thu, 24 Mar 2011, IST    vv Share  Buzz up!
కార్మిక సంఘాల ఐక్య ధర్నా
హైదరాబాద్‌ (వి.వి.) : రాష్ట్రంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.10 వేలకు పెంచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 5 లక్షలపైగా ఉన్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించే వరకు ఐక్య ఉద్యమాలను కొనసాగిస్తామని పలు కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పి.జె చంద్రశేఖరరావు హాజరుకాగా, ఎఐటియుసి కార్యదర్శి నరసింహన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబాబు, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్‌.వెంకటే శ్వరరావు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు నాయిని నర్సింహారెడ్డి, నాయకులు ఆర్‌.రాంబాబు, ఎఐయుటియుసి నాయకులు సుధీర్‌, సిసిఇడబ్య్లూడబ్య్లూ నాయకులు వి.నాగేశ్వరరావు, ఎఐడిడిఇఎఫ్‌ నాయకులు చంద్రయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు మహమ్మద్‌ యూసుఫ్‌ (ఎఐటియుసి), జె.వెంకటేశ్‌ (సిఐటియు), వెంకటేశ్‌ (హెచ్‌ఎంఎస్‌), ఎస్‌.ఎల్‌.పద్మ (ఐఎఫ్‌టియు), అశోక్‌ (టిఎన్‌టియుసి) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, శాశ్వత స్వభావం గల పనులలో శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లు మారినాఅప్పటికే అక్కడ పని చేస్తున్న కార్మికులను తొలగించడమో, మార్చడమో చేయరాద న్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న కార్మికులకు పెరిగిన ధరలకు అనుగు ణంగా కనీస వేతనం 10 వేలకు పెంచాలని గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
నరసింహన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఇప్పటికే రూ.40 వేల వరకువున్న వేతనాలను రెట్టింపు చేయాలని అడిగిన వెంటనే జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అమలు చేయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రికి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు. కార్మికులకు ఇచ్చే నాలుగు, ఐదు వేల రూపాయలు జీతం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇస్తే ఇంట్లో వారికి తిండి పెడతారో, లేక వాత పెడతారో తెలుస్తుందన్నారు. సుధాభాస్కర్‌ మాట్లాడుతూ కనీస వేతనానికి సంబంధించి జీవో విడుదల చేసినా అమలు చేయడం లేదని విమర్శించారు. అమలు అయ్యేలా ముఖ్యమంత్రిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జి.రాంబాబు మాట్లాడుతూ, కనీస వేతన జీవో విడుదల కోసం పోరు తప్పడం లేదని, మరోవైపు వచ్చిన జీవో అమలుకు కూడా ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేెటన్నారు. ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని జీవో నెం.6 క్లాజ్‌ (7)ను విధిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌.రాంబాబు, సుధీర్‌లు మాట్లాడుతూ, కార్మికుల చట్టం ప్రకారం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులన్న తేడా లేకుండా సంవత్సరంలో 30 రోజులు పని చేస్తే బోనస్‌ ఇవ్వాలని ఉన్నా, కార్మికులకు మాత్రం ఏళ్ళకు ఏళ్ళుగా పనిచేస్తున్నా బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. వి.నాగేశ్వరరావు, చంద్రయ్య మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో జరిగిన ఇండియన్‌ లేబర్‌ కాన్ఫ్‌రెన్స్‌ సూచనల మేరకు కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతి కార్మికునికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పునరావాసం,

పునరావాసం, పునర్నిర్మాణం పేరుతో పేదలను దూరం చేయొద్దు

Wed, 23 Mar 2011, IST    v Share  Buzz up!
కె.శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌, (వి.వి.) : ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా, పునరావసం కల్పించకుండా నిరుపేదలు నివసించే మురికివాడలను నగరానికి దూరంగా తరలించడం నేరమవుతుందని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజెయు) సెక్రటరీ జనరల్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో లోతైన చర్చ జరగకుండా కేంద్రప్రభుత్వం మురికివాడల పునరాభివృద్ధి, పునరావాసం, నివారణాచట్టం- 2010 (మెప్మా) పేరుతో రూపొందించిన ముసాయిదాబిల్లును రాష్ట్రప్రభుత్వం చట్టంగా తీసుకువస్తే అది పేదప్రజల నివాసహక్కుకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. బుధవారం నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 'అందరికీ నివాసహక్కు' డిమాండ్‌పై, నివాస హక్కుల పరిరక్షణ ప్రచారసమితి (ఛత్రి) ఆధ్వర్యంలో జరిగిన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం 'రాజీవ్‌ ఆవాస్‌ యోజన' అమలుకోసం రూపొందించిన మురికివాడల అభివృద్ధి, పునరావాసం, నివారణ చట్టం అనే పదాలు పేదలకు చెడుచేయకుండా ప్రభుత్వ ఉద్దేశ్యం యథావిధిగా అమలు చేస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ చట్టంలోని లొసుగులు అధికారులకు, రాజకీయవేత్తలకు చాలా అందుబాటులో ఉండి వారికి లబ్ధిచేకూర్చేదిగా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు.నగరాలు, పట్టణాల్లో భూమి బంగారం కంటే ఎక్కువగా పెరిగిపోతుందని, పేదలు నివాసమేర్పరచుకోవడానికి అనువుగా ఉన్న 95 శాతం ప్రభుత్వభూమిని ల్యాండ్‌మాఫియా, కొందరు రాజకీయవేత్తలు, బ్యూరోక్రసీ ఏకమై అక్రమించుకునేందుకు యత్నించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మహీధర్‌ రెడ్డి రాష్ట్రంలో రాజీవ్‌ ఆవాస్‌ యోజన అమలుకు కేంద్రాన్ని రూ.68 వేల కోట్లనిధులు కోరితే, రూ. 6,500 కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు. 2014 నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా మురికివాడలు లేకుండా చేస్తామన్న ప్రభుత్వఆకాంక్ష సరైనదైనప్పటికీ, ఆచరణ కష్టసాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాబిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌కు ప్రయత్నించే అవకాశం కూడా ఉందన్నారు.మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్‌ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ సిటీ కాన్సెప్ట్‌ వస్తుందని అందుకు షాంఘై నగరాన్ని ఉదహరించారు. నగరాలు చాలా అందంగా ఉండాలన్న పేరుతో పాలకులు పేదలను నగరాలనుంచి వెళ్ళగొట్టే ఆలోచన చేయడం ఆక్షేపణీయమన్నారు. మురికివాడలను, ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం (పిపిపి) పేరుతో అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. పిపిపి చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. పాలకులు రాజకీయలబ్ది కోసమే ఎన్నికలప్పుడు పథకాలను రూపొందిస్తున్నారని, ప్రజలకు జీవించే హక్కు ఉన్నప్పటికీ నివాసహక్కు కల్పించకపోవడం విచారకరమన్నారు. ఛత్రి కన్వీనర్‌ బ్రదర్‌ వర్ఘీస్‌ తెక్నాథ్‌ మాట్లాడుతూ పేదప్రజలకు నివాసహక్కు దక్కే విషయంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా నేటికీ అట్టడుగువర్గాల ప్రజలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. పేదలకు నివాసహక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ఛత్రి కో- ఆర్డినేటర్‌ జె.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఛత్రి కన్వీనర్‌ వర్ఘీస్‌ సమాధానాలిచ్చారు.

కాంగ్రెస్ కు భంగపాటు

కాంగ్రెస్ కు భంగపాటు

  • 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ బోణీ
  • టిడిపికి రెండు బోనస్‌
  • డిఎస్‌, సిఎం 'పోస్టుమార్టం'
  • నివేదికతో నేడు ఢిల్లీకి కిరణ్‌
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎనిమిది జిల్లాల్లోని తొమ్మిది 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరగ్గా కాంగ్రెస్‌కు భంగపాటు కలిగింది. తొమ్మిది స్థానాల్లో మూడు మాత్రమే అధికార కారగ్రెస్‌కు దక్కగా ఆరింట ఓడిపోయింది. జగన్‌ గ్రూపు అభ్యర్ధులు మూడు స్థానాల్లో గెలుపొందగా టిడిపికి మరో మూడు స్థానాలు లభించాయి. గతంలో ఈ తొమ్మిదింటిలో ఆరు కాంగ్రెస్‌ స్థానాలు కాగా రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, ఒక చోట టిడిపి అభ్యర్థి గెలిచారు. ఆరు స్థానాలున్న కాంగ్రెస్‌కు ఈ సారి మూడే వచ్చాయి. ఇదే సమయంలో ఒక సిట్టింగ్‌ స్థానం ఉన్న టిడిపికి రెండు బోనస్‌గా వచ్చాయి. కాంగ్రెస్‌లోని గొడవల కారణంగానే టిడిపి లాభ పడింది. ఇక జగన్‌ గ్రూపు మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకొని బోణీ కొట్టింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పరాజయం పాలయ్యారు.
అక్కడ జగన్‌ గ్రూపు అభ్యర్థి గెలవడం కొసమెరుపు. చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికకు ముఖ్యమంత్రి స్వయంగా పావులు కదిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జగన్‌ సొంత జిల్లా కడపలో ఆయన గ్రూపు నిలబెట్టిన అభ్యర్థి గెలుపొందినప్పటికీ ఇదేమంత గెలుపు కాదని రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్ధులు అంటున్నారు. కడప జిల్లా మొత్తం తనదేనని వైఎస్సార్‌ పార్టీ చెప్పుకుంటున్న తరుణంలో జగన్‌ గ్రూపు అభ్యర్థికి కేవలం పది ఓట్ల మెజార్టీ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జగన్‌ గ్రూపు వశమైంది. ఇక్కడ ఊహించినట్లుగానే గంగాభవానీకి చుక్కెదురైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. అయినా ఆమెకే టిక్కెట్‌ ఇవ్వడంతో జగన్‌ గ్రూపు గెలుపునకు మార్గం సుగమైంది.
'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలకు ఆజ్యం పోశాయి. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డికి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ మధ్య బహిరంగంగా విమర్శల తూటాలు పేలుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మొదటి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, షాజహాన్‌ తదితరులు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇది సిఎంకు చెంప పెట్టులాంటిది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చక్రం తిప్పినట్లు పేరొచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడంతో సొంత పార్టీ నేతలు ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ నేరుగా సిఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్‌ విమర్శలను పక్కనబెడితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడంతో పెరిగిన ముఖ్యమంత్రి ప్రతిష్టను 'స్థానిక' ఎమ్మెల్సీ ఫలితాలు పాతాళానికి దిగజార్చాయి. 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి రాజకీయ పార్టీలు డబ్బు మీదనే నడిచాయి. ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణ లొచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, జగన్‌ గ్రూపు వేర్వేరు చోట్ల ఓటర్లకు శిబిరాలు నిర్వహించాయి. టిడిపి సైతం కొన్ని చోట్ల క్యాంప్‌ రాజకీయాలు చేసింది. భారీ స్థాయిలో ఓటర్ల కొనుగోళ్లు జరిగినట్లు వార్తలొచ్చాయి. తొలుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని, తమ మద్దతుదార్లు ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని జగన్‌ ప్రకటన చేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పొచ్చింది. జగన్‌ బహిరంగంగా కనబడకపోయినప్పటికీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు, నేతలు 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఆ విధంగా కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని ఒక స్థానంలో జగన్‌ గ్రూపు అభ్యర్థులు రంగంలోకి దిగగా కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరిలో విజయం సాధించారు. పశ్చిమ గోదావరిలోని మరో స్థానంలో టిడిపి నెగ్గింది. తూర్పు గోదావరిలో జగన్‌ గ్రూపు, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలిక టిడిపికి లాభించింది. అక్కడ టిడిపి అభ్యర్థి గెలుపొందారు. అనంతపురం స్థానం మరీ విచిత్రం. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్న అసంతృప్తితో ఉన్న జెసి దివాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చూపారు. తమ గ్రూపు ఓటర్లను ఎన్నికల్లో ఓట్లు వేయనీకుండా చేశారు. దీంతో అక్కడ ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి గెలుపొందారు. పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి గతంలో వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారని పేరుంది. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ పరోక్షంగా జగన్‌ గ్రూపుతో చర్చలు జరిపి వారి తరఫున అభ్యర్థి లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది. అయితే మంత్రులను వ్యతిరేకిస్తున్న జెసి తనదైన శైలిలో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి లేరంటూ ఎన్నికలను బహిష్కరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి చెందడంతో అనంతపురం జిల్లాలో మంత్రులు, జెసి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. జెసి కాంగ్రెస్‌ ద్రోహి అని, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి రఘువీరా విమర్శించగా, మంత్రులే ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని జెసి గ్రూపు ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంది. పార్టీ నిట్టనిలువునా చీలింది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన సన్నిహితుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన గెలుపు వెనుక ధర్మాన కృషి ఉందని చెప్పాలి. ఇక నెల్లూరులో జగన్‌ గ్రూపు అభ్యర్థి ఉన్నప్పటికీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, నేదురుమల్లి గ్రూపులు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కలిసి పని చేశారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. అందుకే అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారంటున్నారు. కర్నూలులో ఎస్‌వి సుబ్బారెడ్డి కుమారుడు ఎస్‌వి మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకిదిగి విజయం సాధించారు. ఇక్కడ జగన్‌ గ్రూపు ఎస్వీకి మద్దతిచ్చింది. ఎస్వీ సోదరి శోభానాగిరెడ్డి ప్రస్తుతం జగన్‌కు మద్దతిస్తున్నారు. ఆ సంబంధాలే జగన్‌ గ్రూపు అభ్యర్థిని నిలబెట్టకుండా చేశాయని సమాచారం.
ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఇప్పుడు డబ్బు ప్రభావం ఎన్నికల్లో పని చేసిందంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు మంత్రులు రంగంలోకి దిగి నానా ప్రలోభాలకు గురి చేశారన్నది బహిరంగ రహస్యం. అవేమీ తెలీనట్లు వ్యవహరిస్తున్నారు సిఎం. నిజానికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ, క్యాంపు రాజకీయాలు, మద్యం ప్రవాహం తదితర అరాచకాలు ప్రబలాయి. వీటికి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలన్నీ బాధ్యత వహించాల్సి ఉంది. తూర్పుగోదారి జిల్లాలో పలువురిపై పిసిసి అధ్యక్షుడు సస్పెన్షన్‌ వేటు వేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అదుపు చేయలేకపోయారు. ఫలితాలొచ్చాక ఎక్కడో తప్పు జరిగిందని, పోస్టుమార్టం చేస్తున్నామని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్‌, సిఎం హెచ్చరికలు చేస్తున్నారు. నిజానికి మాజీ మంత్రి జెసిపై చర్య తీసుకొనే స్థితి ప్రస్తుత కాంగ్రెస్‌కు లేదనే చెప్పాలి. అలాగే చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు తమ అభ్యర్థి జగన్‌ గ్రూపు కాదు కాంగ్రెస్‌ అభ్యర్థి అని చెబుతున్నారు. బహిరంగంగా సిఎంకు సవాల్‌ విసురుతున్న పెద్దిరెడ్డిపై సైతం చర్యలు తీసుకోలేని బలహీనత కాంగ్రెస్‌కు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అధిష్టానానికి డిఎస్‌, సిఎం వేర్వేరుగా నివేదికలు తయారు చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానానికి అన్ని విషయాలూ వివరించడానికే కిరణ్‌ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏది నా మాదిగ

ది నా మాదిగ పల్లెలో కత్తికి పదును పెట్టి తోలు జేక్కను పలుగాజిరి కాలుకు కొలత తిసి తోలు పెట్టి తోలుతో నా అరె పదునెక్కి తోలుకు దిగొట్టి తోలు చిరికతో ముడిపెట్టి పదును పెట్టి పను రాయి గుటాముతో మొలలు దిఘ గొట్టి నా రా చిరి జేడకట్టి రిబ్బన్ అల్లి ముద్దుగా ముడిచేతే అ తోలు చెప్పు సింగారించి సమారు పెట్టి కళ్ళకు తొడిగి బాటన  పోతుంటే కిర్రు కిర్రు చప్పుడు నా కాళ్ళ జోడు రాజులూ కట్టించిన రతి మేడలు ఎక్కువో మాదిగ ముడిచినా తోళ్ళ చెప్పులు గూడా అంతా రాజ్యానికి రక్షణ  గోడలంటివి గట్టు కెళ్ళినా ముళ్ళ పొదలు తొక్కినా ముట్టనియదు  కాళ్ళకు రాయి దోక్కినా నిప్పు  రవ్వ తొక్కినా బోడుపు రానివ్వదు బొగ్గ కానివ్వదు ఏది నా మాదిగ పల్లెలో తోళ్ళ కోతల చప్పుడు ఏది తొక్కి తిరుగాదామన్న నటి సంధడేది చినిగన చెప్పుకు వుంగటం ముడుచే పెద్దలేరి నా కత్తికి కల తప్పి పని రాయి గుతము ములకు ములుగా పట్టే నా అరె సిమ్మట సిలుము ఎక్కి కానరాదే లంద గోలేము ఎండిపోయే తోళ్ళ వునుడు మనుడాయే తంగడి చెక్క తలదన్ని పాయె నా వృత్తి ధర్మం కులిపయే భాతుకు బారము బరేడాయే కాదు కాదు కుదోసిన అ కుభేరులు అగ్రవర్ణ రాక్షసులు పరిశ్రమలు పెట్టి పడుచేసిరి చేతి నిండా పనిలేక కూటికి కుమిలిసచ్చే నా మాదిగలు యుగాలు మారి మతాలు మారిన మార్పు రాదాయే నా మాదిగ జాతిలో ఎన్నాళ్ళు ఇంకా ఎంత కాలము యి ఆఘా చట్లు పడ లేక  అమానుషము అంటా రానిథానము వెలిఎయడము బలి చేయడము తగదు తగదు ఉద్యమిస్తము ఉప్పెనైతము లేవాలి లేచి నడవాలి ఉద్యమానికి తేవాలి నా మాదిగ జాతికి అ మార్పు ------------- చెరుకు పల్లి జనార్దన్ మాదిగ భువన గిరి డివిజన్ మాదిగ దండోరా సంక్షేమ సమితి అద్యక్షులు సెల్ నంబర్ 9912978924