సమాచార కమిషన్లో అదనపు కమిషనర్లను నియమించాలి
                                                                                                                                                                           కిరణ్కుమార్కు నారాయణ లేఖ
                   
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్  సమాచార కమిషన్లో అదనంగా కమిషనర్లను నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్  రెడ్డికి సి.పి.ఐ. రాష్ట్ర సమితి కార్యదర్శి డా|| కె.నారాయణ విజ్ఞప్తి  చేశారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ యిలా  వున్నది. సమాచార హక్కు చట్టం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయి నప్పటికీ  నిజాయితీగా చెప్పుకోవాలంటే అది సంతృప్తికర స్థాయిలో లేదా ఆశించదగ్గ రీతిలో  అమలుకు నోచుకోలే దన్నది మీకూ తెలిసిన విషయమే ! చట్టపు ఆచరణకు సంబంధించిన  బలమంతా తగినంత మంది యోగ్యులైన కమిషనర్ల నియామకంపైనే అధారపడి ఉంటుందన్నారు. ఏ  కారణాల వల్లనైతేనేమి గతంలో ఒక ప్రధాన కమి షనరు, ముగ్గురు కమిషనర్ల నియామకం  మాత్రమే జరిగిందన్నారు. ఈ 6 సంవత్సరాల అనుభవం చెబు తున్న దాన్ని బట్టి  సమాచార హక్కు చట్టం క్రింద సమా చారం కోరుతూ చేసుకున్న దరఖాస్తులను  పరిష్కరించే పని పౌర సమాచార అధికారుల స్థాయిలో సక్రమంగా అమలు జరగలేదన్నారు.  ఆ నేపధ్యంలో కమిషన్కు వచ్చిన అప్పీళ్ళ పరిష్కారం కూడా తగినంత మంది కమి  షనర్లు లేకపోవటం వల్ల విపరీతమైన జాప్యం జరు గుతూ నెలలే గాక సంవత్సరాల తరబడి  అపరిష్కృతం గానే పడి ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అంతగా  చైతన్యవంతంగాని ఈ దశలోనే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా, ఏ.ఎం.ఆర్ -  అపార్డు ద్వారా ప్రభుత్వాధికారులకే గాక ప్రజలకూ అవగాహన కల్గించే  కార్యక్రమాలు చేపట్టింది. ఈ రెండు సంస్థల యత్నాల వల్ల రాబోవు కాలంలో  చైతన్యవంత మైన ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించు కోవడానికి  పూనుకుంటారు. ఆ పరిస్థితిలో వారు కోరిన సమాచారాన్ని అందించడానికి గానీ,  సమాచారాన్ని సక్రమంగా అందిచని వారిపై చర్యలు తీసుకోవడానికి తగినంత మంది  కమిషనర్లు, వారికి సహకరించే సిబ్బంది, అనువైన సామాగ్రి లేకుండా సాధ్యపడదు.  కనుక పూర్తి స్థాయిలో కమిషనర్ల నియామకం తప్పని సరిగా చేయవలసి ఉందన్నారు.  ఇది జరగకుంటే కమిష నర్ల ముందుకు వచ్చే ఆప్పీళ్లు పెండింగ్ కేసులు మాదిరే  తయారయ్యే ప్రమాదముందన్నారు.
అంతేగాక కమిషనర్ల ఎంపిక విషయంలో  సమాచార హక్కు చట్టం నిర్ధేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన  వ్యక్తులను కమిషనర్లుగా నియమించక పోయినా, చట్టం ఆశిస్తున్న రీతిలో ప్రజలకు  న్యాయం జరగదన్నారు. కనుక ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను  దృష్టిలోపెట్టుకొని చట్టం అవకాశం కల్పి స్తున్న మేరకు ప్రధాన కమిషనర్కు  తోడుగా 10 మంది కమిషనర్లను నియమించ వలసిందిగా కోరారు. ఇప్పటికే కర్నాటక,  మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పదిమంది చొప్పును  కమిషనర్ల నియామకం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన కంటే  చిన్న రాష్రాలలో కూడా ఎక్కువ సంఖ్యలో కమిషనర్ల నియామకం జరిగి, సమాచార హక్కు  చట్టం ఆదర్శప్రా యంగా అమలు జరుగుతున్నదన్నారు. ఈ దశలో పెద్ద రాష్ట్రమైన  ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కమిషనర్ల ఎంపిక జరగక పోవడం విచారకరమన్నారు. వెంటనే  కమిషనర్ల ఎంపికతో పాటుగా కమిషన్లో తగినంత మంది సిబ్బందిని, సామాగ్రిని,  వసతులను సమకూర్చవలసిం దిగా కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 26 లో  చూపించిన విధంగా వీలైనంత ఎక్కువగా దాన్ని గురించి చేయవలసిన ప్రచారానికి  వీలైనంత ఎక్కువగా నిధులను సమకూర్చాలని కోరారు.
సమాచారం అందక  ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు రెండవ అప్పీలు విషయంలో రాష్ట్ర రాజధానికి  రావలసి రావడం పెను భారంగా మారిందన్నారు. అందుచేత రెండు లేక మూడు జిల్లాలకు  ఒక కమిషనర్ చొప్పున ప్రాంతీయ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేసి చట్టం  ప్రధానంగా ఉద్ధేశిస్తున్న పేద ప్రజలకు న్యాయం చేకూర్చవలసింనదిగా కూడా  ముఖ్యమంత్రి కిరణ్కుమార్కు నారాయణ విజ్ఞప్తి చేశారు.