ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించండి

న్యూఢిల్లీ, మే 3: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, అందుకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికీ మనుషులతో కొనసాగిస్తున్న పాకీ పనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా గత నెలలో జరిగిన నేరాల ప్రస్తుత పరిస్థితిపై నివేదికను ఆ శాఖ పరిశీలించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు దేశీయ వ్యవహారాల శాఖ పలు సూచనలను జారీ చేసింది.

దాని ప్రకారం.. పోలీసు లు, శాంతిభద్రతలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అం శం కాబట్టి నేరాలు జరగకుండా నిరోధించడానికి అవి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ఇండియాలో ఇంకా మనుషు ల చేత పాకీ పని చేయించడం దారుణమని, దాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చి 17 ఏళ్లయినా ఎవరూ శిక్షింపడలేదని ఆ శాఖ సూచనల్లో పే ర్కొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూ ర్తిగా దానిని నిర్మూలించడానికి అత్యవసర కృషి చేయాలని తెలిపింది.