మహా పురుషుల విగ్రాలు వొద్దు అంటున్న దళిత నాయకులు  వరంగల్ జిల్లా పరకాల పట్టణములో మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని నెల కోలుపుటకు ఎటువొంటి చందాలు అడుగాకుంట నేరుగా విగ్రము తిశుకోచ్చి పరకాల బస్సు స్టాండ్ పరిదిలో ఒక ప్రక్కన ఉంచి జిల్లా నుండి మండలము నుండి పరకాల గ్రామము నుండి అన్ని అనుమతులు మాదిగ దండోరా జిల్లా ప్రతి నిధులు బోట్ల స్వామి మాదిగ జయక్క మాదిగ తీసు కున్నారు.ఇట్టి విగ్రమునకు ఇతర దళిత కుల సంఘాల నాయకులు ఇబ్బందులు సృష్టిస్తూ కొంత మంది కాంగ్రెస్ దళిత నాయకులు మేము బాబు జగ్జీవన్ రామ్ కాంస విగ్రాన్ని పెడుతము. కావున మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున వొచ్చిన విగ్రము ఇక్కడ వొద్దు అంటున్నారు.వేరే మండలములో పెట్టండి.అంటూ వివిధ రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అంతేగాక వరంగల్లు MP సిరిసిల్ల రాజయ్య విగ్రము ఇస్తున్నాడు.  అంటూ ప్రచారము చేస్తూ పేపర్ ప్రకటనులు చేయు చేయుచున్నారు.ఇట్టి విషయాన్నీ మాదిగ దండోరా బోట్ల స్వామి మాదిగ సిరిసిల్ల రాజయ్య వోద్దకు తిసుకేల్లగా అట్టి కాంగ్రెస్ దళిత నాయకులను పిలిపించి మాట్లాడి ఇప్పుడు వొచ్చిన విగ్రాన్ని నెలకొలిపి తదుపరి కొద్ది రోజులకు కాంస విగ్రము పెడుదామని చెప్పారు.ఇట్టి మాటలు విన్నా కాంగ్రెస్ దళిత నాయకులు సరే అని తిరిగి వెళ్లారు.అందుకు బోట్ల స్వామి మాదిగ రాజయ్య గారికి ధన్యవాదాలు చెప్పి వొచ్చారు.18 -05 -2011 రోజునా బోట్ల స్వామి మాదిగ ఆధ్వర్యములో  భూమి  పూజ చేయగా అదేరోజు విగ్రము వొద్దు అని తెలిపిన కాంగ్రెస్ దళిత నాయకులు మరో బాబు జగ్జీవన్ రామ్ కమిటి వేశి అట్టి కమిటిలో మాదిగ దండోరా సంక్షేమ సమితి బోట్ల స్వామికు తెలుపకుండా బోట్ల స్వామిని కూడా అట్టి కమిటి లో మెంబరుగా ప్రకటించారు.ఇక్కడ ముఖ్య విషయము ఏమిటి అనగా గత ముప్పైదు ఏండ్లుగా దళితులే యి యొక్క నియోజక వర్గాన్ని పరిపాలించారు.కానీ నాటి  నుండి నేటి  వరకు పరకాల పట్టణములో ఎక్కడ బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని పెట్ట లేక పోయారు.ఇప్పుడు పెడుతున్న విగ్రమునకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.ఇది ఎంత వరకు న్యాయము......మరో విషయము ఏమిటి అంటే మాదిగ దండోరా వారు తెచ్చిన విగ్రము ఎనిమిది ఫీట్ల ఎత్తు మూడు ఫీట్ల ఎడేలుపు కలదు.ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి అంటే ......ఇన్ని రోజుల నుండి కొంత మంది సీనియర్ దళిత నాయకులు ఇప్పుడు వొచ్చిన మాదిగ దండోరా తరుపు  విగ్రాన్ని యెరుపాటు చేస్తే మా బావిత్వ్యము ఏమిటి అనే ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది.వరంగల్ జిల్లలో మరో విషయము ఆస్వా రాయి పల్లి గ్రామము రఘునాధ పల్లి మండలము లో కూడా మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి ఎటువొంటి చందాలు వోసులు చేయకుండా  అంబేద్కర్ విగ్రాన్ని కూడా తెచ్చారు.ఇక్కడ ఇంకా మహా గోరము జరిగింది.ఇట్టి విగ్రాన్ని నేలా కోలుపటము చూసి జీర్ణించుకోలేని కొంత మంది దురుమర్గులు భారత రత్న అంబేద్కర్ విగ్రాన్ని కొద్దిగా ద్వంసము చేసారు.ఇట్టి కేసు వరంగల్ జిల్లా DSP  పరిదిలో ఉన్నది నేటికి అట్టి కిరాతకులను పట్టుకోలేక పోయారు.చివరకు అంబేద్కర్ విగ్రానికి వోరికోత మిషిని తగిలినది  అని చేతులు దులుపుకున్నారు.నేడు మహా పురుషులకే యిన్ని  అవమానాలు జరుగు తుంటే పట్టించు కోవటము లేదు యి ప్రబుత్వం మరి సాదారణ దళితులకు అన్యాయము జరిగితే దిక్కు ఎవరు..................ఓ దళిత జాతి మెదవులరా ఆలోచించండి ........................మన జాతి మహా పురుషుల విగ్రాలను పెడుదాం వారి అడుగుజాడలలో నడుద్దాం వారి ఆశయాలను సాదిద్దాం దళిత జాతిని అబివృద్ది చేద్దాం ...............................మాదిగ దండోరా సంక్షేమ సమితి