విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదు

ఎమ్మెల్యే అమరనాధరెడ్డి
పలమనేరు(వి.వి): విద్యార్ధుల జీవితాలతో ఈప్రభుత్వం ఆడుకోవడం తగదని ఎమ్మెల్యే అమరనాధరెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పలమనేరు పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భరగా ఆయన మాట్లాడుతూ ఈప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడంతో వేలాది మంది విద్యార్ధుల జీవితాలు నాశనమయ్యే పరిస్ధితి ఏర్పడిందని దుయ్యబట్టారు.చిత్తూరు జిల్లాలో మాత్రమే 59 వేలా 700 మంది విద్యార్ధులు ఉండగా వారికి ఉపకారవేతనాలు ఈవిద్యా సంవత్సరానికి అందలేదన్నారు. 184 కోట్లు పెండింగ్‌ పెడితే విద్యార్ధుల భవిష్యత్‌ ఏమికావాలని ప్రశ్నించారు. అదేవిధంగా జిల్లాలో 20 వేల మంది ఇబిసి విద్యార్ధులు ఉండగా వారికి ట్యూషన్‌ ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ సుమారు 116 కోట్లు ఇవ్వవలసి ఉందన్నారు. ఇది ఇలాఉంటే విద్యార్ధుల భవిష్యత్‌ ఏమవుతుందని ప్రశ్నించారు.2008-09 విద్యా సరవత్సరానికి సంబంధించి 29.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈఆర్ధిక సంవత్సరంలో ముగియడంతో విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇచ్చేవారిలాగే మాట్లాడుతున్నారు కానీ ఇవ్వలేదన్నారు. ఎల్‌ఓసిలు క్లియర్‌ చేసిన తర్వాత అర్ధగంటకే సర్వర్‌డౌన్‌ అయిందని చెప్పడం హాశ్యాస్పదం గా ఉందన్నారు. ఇలాంటి కాకమ్మ కబుర్లు వినేపరిస్ధితిలో ప్రజలు లేరన్నారు. రోశయ్య మార్పు రాజకీయాన్ని మ్యూజిక్‌తో చేస్తే చూస్తూఉండరని విమర్శించారు. విద్యార్ధులు తిరగబడితే రోశయ్యకు ఏంజరుగుతుంతో త్వరలో తెలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.