గ్రామ సేవకుల ధర్నా

మానకొండూర్, ఏప్రిల్ 29 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ సేవకులు ధర్నా చేశారు. మం డల గ్రామ సేవకుల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పిల్లి రాములు, ఉండింటి రాంప్రసాద్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5 వేలు, డీఎ రూ. 50 నుంచి రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న గ్రామ సేవకుల పోస్టులను భర్తీ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

2009 ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా 46 రోజుల సమ్మె చేయగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలతో పాటు డీఎ పెంపు ఆర్థికేతర సమస్యల పరిష్కరిస్తామని చెప్పిన ఆచరించడం లో ప్రభుత్వం విఫలం అయిందన్నా రు. కార్యక్రమంలో దుర్గయ్య, అంజ య్య, కుంభం కుమారస్వామి, కిశోర్, కనకయ్య, కొంరయ్య, కుమారస్వామి, రాములు, మొండయ్య, పాల్గొన్నారు.

తిమ్మాపూర్ : గ్రామ సేవకులు వారి డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. జిల్లా పిలుపుమేరకు గ్రామ సేవకుల సంఘం మండ ల అధ్యక్షుడు కొమురయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రమేశ్, అశోక్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

రామడుగు : మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామసేవ కులు ధర్నాచేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు సిరికొండ అంజయ్య, రమేశ్, మామిడిపెల్లి నర్సయ్య, లేవుటు కనుకయ్య, గునుకొండ లచ్చయ్య, కమలాకర్, రవీందర్, పోచయ్య, ఎల్లయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

చెత్త వాగుడు

బొంకరా మల్లన్న అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత అని అన్నారట వెనకటికెవడో. సువిశాల భారతదేశానికి హోంమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా అదే రీతిగా మాట్లాడడం దేశానికి పట్టిన దౌర్బాగ్యం.
దేశ అంతర్గత భద్రతకు ప్రధాన ముప్పు మావోయిస్టులని ఒకవైపు ప్రధాని చెబుతుంటే ఆయన మంత్రివర్గంలోని మమతా బెనర్జీ ఆ మావోయిస్టులతోనే చెట్టపట్టాలేసుకుని సిపిఎం నాయకులపై హత్యాకాండ కొనసాగిస్తోంది. కానీ హోంమంత్రిగా వున్న చిదంబరం మమతను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. 149 మంది ప్రయాణీకుల దుర్మరణానికి కారణమైన జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం మావోయిస్టుల జేబు సంస్థయిన పిసిపిఏ కుట్రేనని సిబిఐ నిగ్గుతేల్చింది. మావోయిస్టు, తృణమూల్‌ హింసాకాండకు జంగల్‌మహల్‌ ప్రాంతంలో 161 మంది ఆదివాసీలతో సహా 265 మంది సిపిఎం, వామపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులూ ప్రాణాలు కోల్పోయారు. ఆధారాలతో సహా వివరించినా పట్టించుకోని కేంద్ర హోంమంత్రి ఎన్నికల సభల్లో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆరోపించారు. ఆయన మంత్రిత్వశాఖకే చెందిన నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం పది లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో లక్ష మందికి జరిగే నేరాల సంఖ్య కొల్‌కతాలో అతి తక్కువగా 103 వుండగా ఏలిన వారి పాలనలోని ఢిల్లీ మహానగరంలో ఆ సంఖ్య 353.7గా వుంది. అలాగే ఐపిసి నేరాల రేటు జాతీయంగా 181.4 వుండగా అది బెంగాల్లో 126 మాత్రమే. అదే విధంగా బెంగాల్‌ విపరీతంగా అప్పుల పాలైందని ఆ పెద్దమనిషి చెప్పారు. వాస్తవంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు రు.2.3 లక్షల కోట్లకు పైగా అప్పులుండగా బెంగాల్‌కు రెండు లక్షల కోట్లు కూడా లేవు. రు. 35 లక్షల కోట్ల అప్పుల కుప్పపై కూర్చున్న యుపిఏ ప్రభుత్వంలో కీలక శాఖను నిర్వహిస్తున్న చిదంబరం గురువింద తనకింద వున్న నలుపెరగనన్నట్లు మాట్లాడారు.
బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మన్మోహన్‌ కూడా స్థాయి మరిచి కువిమర్శలకు పాల్పడ్డారు. విద్య, వైద్య రంగాల గురించి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెన్సస్‌ నివేదికల ప్రకారం బెంగాల్‌ అక్షరాస్యత 77శాతం కాగా జాతీయ అక్షరాస్యత 74 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత బెంగాల్లో 71.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 65.4 శాతం మాత్రమే. వైద్య రంగంలో కూడా దేశంలో 2105 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక పడక చొప్పున ఉండగా బెంగాల్లో 1605 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పడక అందుబాటులో వుంది. ఇవేవీ ప్రధానికి తెలియక మాట్లాడారని అనుకోలేము. అవినీతి బురదలో పడిదొర్లుతోంది యుపిఏ ప్రభుత్వం. ఇన్ని కుంభకోణాలు, ఇన్ని లక్షల కోట్ల బొక్కుడు ఏ ప్రభుత్వంలోనూ లేదు. తన మంత్రివర్గ సహచరుడైన రాజాను 2జి స్కామ్‌లో అరెస్టు చేశాక 'సంకీర్ణ రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి' అని సిగ్గు విడిచి చెప్పిన పెద్దమనిషి ఆయన. దేశంలోనే ఆదర్శవంతంగా సంకీర్ణ పాలన సాగిస్తున్న పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వంలోని ఏ ఒక్క మంత్రి అవినీతి ఆరోపణలపై అరెస్టు కాదు కదా కనీసం ఆరోపణ కూడా లేదన్న విషయం జగద్విదితం. బెంగాల్‌కి లేని సంకీర్ణ సంకటం మన్మోహన్‌కు ఎందుకో? శాంతి భద్రతలపై విమర్శిస్తున్న హోంమంత్రి తన కేబినెట్‌ సహచరుడు ముకుల్‌రారు పుత్రరత్నం, తృణమూల్‌ అభ్యర్థి అయిన శుభ్రంసురారు ఎన్నికల సంఘం ప్రతినిధులపై దాడి చేసిన విషయం మరిచిపోయారా? నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాక ఆ ప్రబుద్ధుడిని మమతా బెనర్జీ పాల్గొన్న సభలోనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలియదా? మావోయిస్టుల మొదలు ఇలాంటి నేరస్తులందరితో జట్టుకట్టి మేరునగం లాంటి వామపక్ష కూటమిని ఎదుర్కొంటోంది. యుపిఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా వున్న టిఎంసీని సంతృప్తి పరచడం కోసం కాంగ్రెస్‌ స్థాయి మరిచి దిగజారిపోతోంది. గతంలో రాజీవ్‌గాంధీ మొదలు ఇటీవల వారి 'యువరాజు' రాహుల్‌ వరకూ ఇలాంటి ప్రేలాపనలకు పోయి భంగపడిన విషయం లోకానికి తెలుసు.
దేశంలోనే ఆదర్శవంతంగా భూ సంస్కరణలను, పంచాయతీరాజ్‌ పాలనను పారిశ్రామిక శాంతిని సాధించడంలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం ముందుంది. దేశమంతటా పంచిన మిగులు భూమిలో 23 శాతం బెంగాల్లోనే పంపిణీ అయింది. 30.12 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా వారిలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలే 70 శాతం మంది కావడం విశేషం. మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక పాత్ర వహిస్తున్న కౌల్దార్లకు కనీసం బ్యాంకు రుణాలు పొందడానికి గుర్తింపు కార్డులను సైతం ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ బెంగాల్‌ ప్రభుత్వం 34 ఏళ్ల క్రిందటే కౌల్దార్లకు సాగు హక్కులను చట్టపరం చేసింది. ప్రజానుకూల పాలనలో అన్నింటా ముందున్న వామపక్ష పాలనకు మరో ప్రత్యామ్నాయం లేదు. యుపిఏ-1 ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే భారాలను వేయ ప్రయత్నిస్తే ప్రతిఘటించడం మొదలు వినాశకరమైన భారత్‌ - అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం వరకూ వామపక్షాలు నికరంగా ప్రజల పక్షాన నిలిచాయి. ఇది గిట్టని భారత పాలక వర్గాల మొదలు అమెరికన్‌ సామ్రాజ్యవాదుల వరకూ వామపక్షాలపై అందునా సిపిఎంపై కత్తికట్టారు. 'మమతను మచ్చిక చేసుకోవాలని' కొల్‌కతా కాన్సలేట్‌ నుంచి వాషింగ్టన్‌కు దౌత్య నివేదికలు పంపినట్లు వికీలీక్స్‌ వెల్లడించడంతో ఇది మరింతగా నిర్ధారణయింది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే ఆ దేశమంటే అపర భక్తిని ప్రదర్శించే చిదంబరం అవాకులు చెవాకులు పేలారు. ఇంతకు ముందు 'నౌ ఆర్‌ నెవ్వర్‌' అంటే బెంగాల్‌ ప్రజలు శృంగభంగం చేశారు. ఇపుడూ కాంగ్రెస్‌ నేతలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. వాటిని విజ్ఞులైన బెంగాల్‌ ప్రజలు తిరస్కరిస్తారు.ప్రజా శక్తీ దిన పత్రిక సౌజన్యముతో 

సంసారం ఓ సంగీతం

ఆఫీసునుండి వచ్చి రాధను చూడగానే సుధీర్‌కు చిరాకెత్తుకొచ్చింది. ఎదురొచ్చి మంచినీళ్లిచ్చి లోపలికెళ్లింది రాధ. వచ్చి టిఫిన్‌, టీ ఇచ్చింది. అయినా అతని మొహంలో పేలాలు పేలుతూనే ఉన్నాయి. కారణమేంటో అర్థంకాని రాధ ఆఫీసులో ఏదైనా గొడవైందేమో అనుకుంది. అడిగితే సమాధానం చెప్పే స్థితిలో భర్త ఉండకపోవడంతో తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ భర్త కోపానికి తానే కారణమని ఆమె అనుకోలేదు. భోజనాల సమయంలోనూ అదే చిరాకు చూపించేసరికి ఇక ఉండబట్టలేని రాధ భర్తను కారణమడిగింది. అతను చెప్పిన కారణం విన్న రాధకు నవ్వొచ్చింది. కానీ నవ్వితే సుధీర్‌కు మరింత కోపం వస్తుందని ఊరుకుంది. అతను అన్నదేంటంటే, ''ఆఫీసులో పడ్డ శ్రమంతా నిన్ను చూసి మర్చిపోదామని నేననుకుంటాను. కానీ నేను వచ్చేసరికి ఎప్పుడూ నువ్వు జిడ్డు మొహంతో కనిపిస్తుంటావు. ఎదురింటి శ్యామల చూడు ఎప్పుడు చూసినా మడత నలగని కాటన్‌ చీరలు కట్టుకుని కడిగిన ముత్యంలా ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉండొచ్చుగా'' అంటున్న భర్తవంక నిశితంగా చూసింది రాధ.

''ఇద్దరు చంటిపిల్లలు, వచ్చే పోయే బంధువులు. పనమ్మాయి ఒకరోజు వస్తే రెండ్రోజులు రాదు. వాషింగ్‌మిషన్‌ కొందామని అనుకుంటున్నా బడ్జెట్‌లోటువల్ల కుదరడంలేదని మీకూ తెలుసు. మీకా పొద్దున్న వండిన కూరలు రాత్రి తినడం ఇష్టముండదు. సాయంత్రం వచ్చేసరికి టిఫిన్‌ కంపల్సరీ. వీటన్నింటిమధ్యా నేను మీరొచ్చేసరికి సింగారించుకుని ఎదురుచూడటం ఎంతవరకూ సాధ్యమో ఓసారి ఆలోచించండి. అయినా మీ చీవాట్లు నేను భరిస్తాను. కానీ మీకు ఇతరులతో పోల్చడం మాత్రం ఒప్పుకోను. ఎదురింటి శ్యామలకు ఇంకా పిల్లలు లేరు. ఈ ఊళ్లో బంధువులే లేరు. అన్నీ చేయడానికి వాళ్లాయన ఓ అమ్మాయిని ఇంట్లోనే ఉంచాడు. వారాంతాలు థియేటర్లో సినిమా, హోటల్‌ భోజనం తప్ప ఇంట్లోనే అసలు వుండరు. ఇక శ్యామల ఎప్పుడు చూసినా తాజా పువ్వులా ఉంటుందంటే ఉంటుంది మరి! అయినా తన విషయం నాకు అనవసరం.

కానీ, మీరు నన్ను ఆమెతో పోల్చడమేంటి? వాళ్లాయన తన భార్యకు కల్పిస్తున్న సౌకర్యాలన్నీ నాకూ కావాలని నేనెన్నడైనా మిమ్మల్ని అడిగానా? మీకంటే ఆయన గొప్పవాడని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరి ఆర్థిక స్థోమత, ఓపికలను బట్టి వారి స్థితిగతులుంటాయి. అంతేగానీ, ఎదుటివాళ్లతో పోల్చుకోవడమేంటీ అసహ్యంగా!'' అంటూ భర్తను కడిగేసింది రాధ. ఎప్పుడూ మౌనంగా పనిచేసుకుపోయే తన భార్యలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని సుధీర్‌ ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఒక్కసారి లావా పెల్లుబికినట్లు మాట్లాడేస్తున్న రాధను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు సుధీర్‌. తర్వాత రాధ మాట్లాడిన మాటల్లో సత్యంపాళ్లే ఎక్కువని గ్రహించుకున్నాడు.

''అయాం సారీరా! ఈ కోణంలో నేనెన్నడూ ఆలోచించలేదు. ఇప్పుడర్థం అవుతోంది నేనెంత తెలివితక్కువగా ఆలోచించానో. ఇప్పట్నించి నావంతు సాయం నేను నీకందిస్తాను. తప్పితే ఇంటి భారమంతా నీపైనే వేయను. ఇంకా ఏమేం సర్దుబాట్లు చేసుకోవాలో చెప్పు. మరో ఆలోచనలేకుండా పాటిస్తాను'' అంటున్న భర్తను చూసి నిండుగా నవ్వింది రాధ. ఆ నవ్వులు సుధీర్‌ గుండెల్లో పువ్వులు పూయించాయని వేరే చెప్పాలా?!ప్రజా శక్తీ సౌజన్యముతో 

శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’

శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’
ramthertha-phoపదిహేనేళ్ళకే చేత తుపాకి ధరించి, ఇరవై ఏళ్ళకే శరణార్ధిగా తన మాతృదేశం విడిచిపెట్టి, తర్వాతి జీవనాన్ని భిన్న భిన్న దేశాలలో కాందిశీకుడుగా కూలి పనులు చేసుకుంటూ, తన మాతృభాష తప్ప మరే భాషా రాని ఒక వ్యక్తిని ఊహించండి. ఇటువంటి వ్యక్తి రచయిత అయ్యే అవకాశం ఉందని ఊహించడం దాదాపు అసాధ్యం. కానీ వర్తమాన జీవన సంక్షోభం ఎంతటిదీ అంటే అది రాళ్ళనుంచి రత్నాలను తయారు చేస్తుంది. అంతర్యుద్ధం బారిన పడి దశాబ్దాలుగా కకావికలైపోయిన ఉత్తర శ్రీలంక ప్రాంతం, అక్కడి ఇటీవలి జీవితం కథావస్తువుగా వచ్చిందీ నవలిక. అసలు శ్రీలంక కవి ఎల్‌.టి.టి.ఇ. ఉద్యమ సంబంధిత సాహిత్యం, కొంత కవిత్వం మినహాయిస్తే దాదాపుగా తక్కువనే చెప్పాలి. దీనికి కారణం అత్యధిక శాతం ఉత్తర శ్రీలంకలో నివసించే తమిళులు (జాఫ్నా), తమ భాష తప్ప వేరే భాషలేవీ తెలిసినవారు, చదువుకున్నవారు కాకపోవడం.

ఈ నవలిక రచయిత- రాసిన కాలానికి 32 ఏళ్ళ వయస్కుడు. ఏంథోనీ జేసుదాస్‌గా పుట్టి, రాకీ రాజ్‌గా తన కథ చెప్పి, శోభాశక్తి పేరిట రచయితగా గుర్తింపు పొందినవాడు. ప్రస్తుతం నలభై ఏళ్ళ వయసు. ‘గొరిల్లా’ పేరిట శోభాశక్తి తమిళంలో రాసిన నవలను 2008లో అనసూయా శివనారాయణ్‌ ఆంగ్లంలోకి అనువదించడా భారతీయ ప్రచురణ సంస్థ రాండమ్‌ హౌస్‌ దీని ప్రచురించింది. ఈ నవల కథా ప్రాంతం ఉత్తర శ్రీలంకలో, జాఫ్నాకు దూరంగా ఉండే ఒక మారు మూల బెసత్త పల్లె. వేర్పాటు వాద సాయుధోద్యమ ప్రకంపనల ధాటికి ఇక్కడి దళిత ప్రజలు అస్తవ్యస్తమవుతుంటారు.

నవలిక ఆరంభం ఫ్రాన్స్‌ దేశంలో. అక్కడ ఒకప్పటి బాల సైనికుడయిన రాకీ రాజ్‌, ఫ్రాన్స్‌ దేశపు హోం శాఖ అధికారులతో ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారి పరిశీలనకు- ప్రశ్నలకు జవాబులు చెప్తూ తన సైనిక జీవిత వివరాలను దాచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రీలంకకు చెందిన తమిళ సాయుధ పోరాట నేపథ్యం గలవారికి యూరప్‌ దేశాల పౌరసత్వం లభించడం కష్టం. సర్వర్‌గా, అంట్లు తోమేవాడిగా, తోటమాలిగా చిన్నా చితకా పనులు చేస్తూ, దేశం కాని దేశంలో వారి వివక్షను ఎదుర్కొంటూ జీవించాల్సిన దురవస్థ ఎంతో మంది సాధారణ శ్రీలంక తమిళులకు ప్రాప్తించింది. ఈ పేద కుటుంబాలు అంతర్యుద్ధంలోని ఇరు వర్గాల మధ్య చిక్కుకుని ఎలా కడగండ్ల పాలయ్యాయో - శోభాశక్తి తన కుటుంబం గురించి చెప్పిన మాటల్లో తెలుసుకోగలం.

‘మా అమ్మా, నాన్నా భారత దేశంలో శరణార్ధులుగా ఉన్నారు. మా గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అదొక నావికా స్థావరంగా మారిపోయింది. ఏమీ మిగల్లేదక్కడ. మా సోదరుడు, సోదరి యూరప్‌లో ఉన్నారు. నేను మా సోదరితో కలిసి జీవిస్తున్నాను’ అని ఈ యువ రచయిత చెప్పిన జీవన విషాదం ఒక తరం శ్రీలంక తమిళ ప్రజల్ని చిందర వందర చేసిన జాతి అస్తిత్వ విద్వేష సర్ప విషం.

gorillaఇంతకీ గొరిల్లా అని పిలిచే దురుసువాడు ఈ రచయిత తండ్రే. నవలిక ఎటువంటి నాజూకుదనాలు, సాహిత్య మర్యాదలు, సౌందర్య దృక్పథాలు పాటించదు. ఇదొక పదిహేనేళ్ళ పిల్లవాడి మాటల్లో చిత్రితమైన కథ. ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) అనుకుంటే కొద్ది పాటిగా వేరు పేర్లూ, స్థలాలూ వాడిన శోభా శక్తి ఈ రచనా ధోరణిని ‘ఆటో ఫిక్షన్‌’ అని అన్నాడు. ‘స్వీయ కల్పన’ అనవచ్చునేమో తెలుగులో.

నవలిక అంతటా అలుముకుని ఉంటుంది అకారణ క్రౌర్యం. రాకీ రాజ్‌ (కథలో శోభా శక్తి) తండ్రి తన కుటుంబం వారితో, ఇరుగు పొరుగు వారితో క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన సైనికులుగా చేర్చుకున్న తరుణ వయస్కుల పట్ల ఎల్‌.టి.టి.ఇ. ఈ క్రూర నియమావళిని అమలు పరుస్తుంటుంది. శ్రీలంక సైన్యం, వారి తమిళ మద్దతుదారులు తీవ్రవాద సైనికోద్యమం పట్ల క్రూరంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. చట్ట వ్యతిరేక శరణార్ధులుగా తమ దేశంలో నివాసం ఏర్పరచుకో చూస్తున్న శ్రీలంక తమిళుల పట్ల ఫ్రాన్స్‌ దేశ ప్రభుత్వ సంస్థలు నిర్దయతో వ్యవహరిస్తుంటాయి. ఈ నవలిక ఒక క్రూరత్వ వర్తులంలో, కటువైన వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడంలో కృతకృత్యత సాధిస్తుంది.

‘గొరిల్లా’ నవలికలో ప్రతి అయిదారు పేజీలకు అధో సూచికల్లో కొన్ని పేర్లు శోభా శక్తి ప్రస్తావిస్తాడు. వీరంతా సాయుధ సైనికోద్యమ క్యాడర్‌గా అంతర్యుద్ధంలో ఆహుతైపోయిన పేద, దళిత తమిళ యువకులే. గొరిల్లా నవల ఒక బతుకు గాయాల మూట. పట్టు తప్పిన సామాజిక కార్యాచరణ వలన నెత్తురోడిన ఉదంతపు విషాద వివరణ. ఎల్‌.టి.టి.ఇ. వర్గాలు తమకు ఎదురు తిరిగిన వారిని, వ్యతిరేకించిన వారిని ఎటువంటి శిక్షలకు గురిచేస్తాయో వాటిని శోభా శక్తి సైతం, తన యువ మిత్రులతో బాటుగా ఒక నిర్బంధ శిబిరంలో అనుభవించాల్సి వస్తుంది. తను ఏ తప్పూ చేయకుండానే ఇటుంటి వికృత, విపరీత అనుభవానికి గురి కావడం శోభ శక్తి కళ్ళు తెరిపిస్తుంది.

ఇంతకీ వారు చేసిన నేరమల్లా ఏమిటంటే, ఎల్‌.టి.టి.ఇ. సాయుధ క్యేడర్‌గా ఉంటూ, తమ గ్రామ శివార్లలోని నది ఇసుక దొంగిలించి పట్టుకుపోయి లాభసాటి వ్యాపారం చేస్తున్న ఒక ఎల్‌.టి.టి.ఇ. ఛోటా నాయకుణ్ణి అడ్డుకోవడం. ఈ శిక్షలు ఇంతటితో ఆగక, వీరు తమిళుల తీవ్రవాద ఉద్యమం గురించి, శ్రీలంక సైన్యానికి వివరాలు అందజేస్తున్నారన్న అనుమానంతో పదే పదే నిర్బంధించడం, నిఘాలో ఉంచడం, వెన్నాడి పట్టుకోవడం వంటి గొలుసు చర్యలకు కొంతకాలం గురయ్యాక, ఇక మిగిలిన మార్గం దేశాంతరం వెళ్ళిపోవడమే అని రహస్యంగా పడవలపై, హెచ్చు డబ్బు చెల్లించి భారత దేశ తీరం చేరడంతో ఒక ముఖ్య ఘట్టం ముగుస్తుంది.

ఫ్రాన్స్‌ ఎలా చేరిందీ కథ అంత వివరాలివ్వదు కానీ, అక్కడ అధికారులు వీరి పౌరసత్వపు దరఖాస్తులను నిశితంగా, తీవ్రంగా పరిశీలిస్తుంటారు. ఎలాగయినా తిరస్కరించాలన్నది వారి లక్ష్యం. సాధారణ పౌరులా, లేక ఎల్‌.టి.టి.ఇ.తో సంబంధం గలవారా అన్నది కీలకాంశం. వీరి తగువులు యూరప్‌ దేశాలలోనూ కొనసాగుతుంటాయి. గొరిల్లా నవల ఆరంభపేజీల్లోనే ఇందిరా గాంధీ హత్య ప్రస్తావితం అవుతుంద. సాక్షాత్తూ దుర్గ అవతారం వంటి ఇందిరా గాంధీ బతికి ఉంటే శ్రీలంక తమిళులకు సత్వర న్యాయం జరిగి ఉండేది అన్నది ఆ శ్రీలంకలోని తమిళ ప్రజల మనోగతం. చరిత్ర ఎటువంటి విరుద్ధ అంశాలతో నిండి ఉంటుందంటే, అది తమిళుల తీవ్రవాద సంస్థ.

తమ కార్యాచరణకు గండి కొట్టేలా ఎక్కడ తిరిగి మళ్ళా ఐ.పి.కె.ఎఫ్‌.ను ప్రయోగించే నిర్ణయం తీసుకుంటారో అన్న భయంతో, ఏ ఇందిరా గాంధీ అయితే బతికి ఉంటే బాగుండును అని తలిచారో, అదే ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్‌ గాంధీని హత్య చేసి, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కరడు కట్టిన టెర్రరిస్టు సంస్థగా పేరు తెచ్చుకుంది. సామరస్య ధోరణి, మితవాదం మొదట్నుంచీ తమిళ వేర్పాటు ఉద్యమంతో అంతర్భాగాలుగానే ఉన్నా, అటువంటి సామరస్య భావజాలం గల నాయకుల్నీ, రాజకీయ పక్షాల్నీ పూర్తిగా నిర్మూలించి తానే ఏకైక శ్రీలంక తమిళుల ప్రజల ప్రతినిధి సంస్థగా పెద్ద ఎత్తున హింసకు దారితీసింది ఎల్‌.టి.టి.ఇ. ఒక పల్లెటూరి జీవితం ప్రమాణంగా, తొలుత సింహళీయుల వివక్ష కొద్ది మేరకు ఉన్నా, ఇప్పుడీ తీవ్రవాద చర్యల వల్ల మొత్తం ఉత్తర శ్రీలంక తమిళులందరూ ఎలా శ్రీలంక సైన్యం, ప్రపంచవ్యాప్త తీవ్రవాద వ్యతిరేక సంస్థల నిఘా నేత్రంలో చిక్కుకున్నారో, ఎలా మద గజాల మధ్య చిక్కిన మేకపిల్లలైపోయారో కొంతైనా చెప్పే ప్రయత్నం చేశాడు శోభా శక్తి ఈ నవలికలో.

ప్రజాస్వామిక పద్ధతులపై విశ్వాసం ఒక ప్రాపంచిక సంస్కృతి. జులుం, అణచివేత, హింసాత్మక ప్రతిఘటన- తమ ప్రభావాన్ని ఆ మేరకు తప్పనిసరిగా సమాజంపై కలిగిస్తాయి. శాంతియుత పద్ధతులపై నమ్మకం గల పాత్ర ‘లొక్కా’ రాకీ రాజ్‌కు ఫ్రాన్స్‌లో తారసపడుతుంది. ఆయనా శ్రీలంక తమిళుడే. నవలలో గాంధీ, మండేలా పంథా కార్యాచరణ సైతం చర్చకు వస్తుంది. ‘లొక్కా’ అంటాడొక చోట ‘మనం అభిప్రాయాల్ని అభిప్రాయాలతో ఎదుర్కోవాలి తప్ప, పిడి గుద్దులతో కాదు’.

తన శాంతియుత పద్ధతుల సమర్ధనకు, దేశం కాని దేశంలో, తోటి తమిళుల చేతిలో లొక్కా హత్యకు గురికావడం కథలో చివరి ఘట్టం. ఈ నవలిక రాస్తున్న కాలంలో తాను ఎంతో ప్రాణభయంతో ఉన్నానని తెలిపాడు శోభా శక్తి. తమిళంలో ఈ నవల చదివి, అనువాదకురాలు తాను ఆంగ్లంలోకి అనువదిస్తానని ఇంగ్లీష్‌లో ఇ-మెయిల్‌ పంపుతే అందుకు శోభా శక్తి జవాబుగా- ఇంగ్లీష్‌ రాదు, కేవలం తమిళం’ అని తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.

rama-therthaశ్రీలంకలోని కుంజన్‌ ఫీల్డ్స్‌ గ్రామం, పరిసరాలు, జాఫ్నా నగరం, అంతర్యుద్ధ కాలపు ఆందోళనలు, ఒక అనధికార యుద్ధ కాలపు అస్తవ్యస్థ సమాజం, బాంబుల బెల్టులు కట్టుకున్న యువతులు, చదువులేని యువతరం, దొంగ సారా వ్యాపారులు, నయవంచక పోలీసులు, హంతకులు, వేశ్యలు, రైతులు, అమాయకులు- ఇందర్నీ గాఢమైన నైరూప్య ఛాయల్లో చూపే అక్షర వర్ణ చిత్రం- గొరిల్లా నవలిక. దీని పఠనానుభవం ఇవాల్టి జీవితాల సూటి పరిచయాన్ని పాఠకులకు అందిస్తుంది. హింసాత్మక వర్తులంలో చిక్కుకునే ఏ సమాజానికైనా- ఉద్యమ లక్ష్యాలు ఎంతటివైనా- ఏం జరుగుతుందో అన్నదానికి ‘గొరిల్లా’ ఒక అనివార్యమైన, కరకు ఉదాహరణ.

బడుగుల చదువులకు వయో పరిమితా ?

studentsహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: వయోజన పాఠ శాలలు పెట్టి వృద్ధులను సైతం విద్యావంతులను చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకు వయోఃపరి మితి విధించే దిశగా అడుగులు వేయడంపట్లు బడుగులు మండిపడుతున్నారు. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’... అంటూ గోడ మీదరాతలు రాయించి గ్రామీణ మహిళలను విద్యావంతులను చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చదువుకునేందుకు ముందుకు వస్తున్న బడుగులపై ఎందుకు బండలు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.

బడుగు విద్యార్థులకు వయోఃపరిమితి నిర్ణయిం చి ఆ వయస్సు దాటిన వారికి ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించేది లేదనే నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంటే, ఇటు బడుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎపిపిఎస్సీ విధి విధానాల ప్రకారం ఉద్యోగ అర్హత కు వయోఃపరిమితిలో ఏ విధమైన నిబంధనల ఉన్నాయో వాటిని విద్యా సంస్థల్లో కూడా అనుసరిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో ఓసీ, బీసీ తదితరుల వయోః పరిమితి 34 సంవత్సరాలుగాను, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో ఐదు సంవత్సరాలు రిలాక్సెషన్‌ ఇవ్వనుంది. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమ లు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది.

table-ageఇదే జరిగితే రాష్ర్ట వ్యాప్తంగా 62 వేలమంది విద్యార్థులకు పైగా వేటుపడే అవకాశం ఉంది. అయితే ఫీజుల విషయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లతో సమానంగా చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం వయోఃపరిమితి విషయానికి వచ్చేసరికి ఎందుకు తేడా చూపుతున్నారని బడుగు విద్యార్థులు ప్రశ్నిస్తు న్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే తమకూ 39సంవత్సరాల వయోఃపరిమితిని కొనసాగించా లని కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దుర్వి నియోగం అవుతున్న కారణంగానే ఈ నిర్ణయం చేయాల్సి వస్తోందని ప్రభ్తుత్వం సమర్ధించుకోవ టాన్ని బడుగు విద్యార్థులు తప్పుపడుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించడం ద్వారా ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాథి పొందే అవకాశం ఉంది కనుక ఎసీసీ ఎస్సీ నిబంధనలతో ఏవిధంగా లింకు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉపాథి చూపట్లే దనీ కనీసం ఉపాథి చూపై కంపెనీలలో చేరే అవకా శాలకు ఎందుకు గండికొడతారని ప్రశ్నిస్తున్నారు.

2010-11 విద్యా సంవత్సరానికి సంబంధించి 70 సంవత్సనాలకు పైబడిన వారు 51మంది పీజీ కోర్సులు చేస్తున్నారనీ, 60నుండి 70 మధ్య వయ స్కులు 20మంది ఉన్నారనీ... గణాంకాలు చూపి అందరిపై వేటు వేసే ప్రయత్నం సరైన నిర్ణయం కాదని బడుగులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతలలేని బడుగులు ఉన్నత చదువులు చదవాలంటే కచ్చితంగా ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తున్న విధంగానే వయోపరిమితి విధించడం సరికాదంటున్నారు. అయితే ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

అన్ని కోణాల్లోంచి పరిశీలించాలి

లోక్‌పాల్‌ కమిటీ కో-చైర్మన్‌గా ఉన్న శాంతి భూషణ్‌, సభ్యుడిగా ఉన్న ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌లపై అవినీతి ఆరోపణలు రేపిన దుమారం మధ్య నూతన లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పనా కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. మురార్జీ దేశారు ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, ఆ తరువాత బిజెపిలో చేరి, అటు పిమ్మట అవినీతిపై పోరాట యోధుల అవతారమెత్తిన శాంతి భూషణ్‌, ఆయన తనయుడు ఇప్పుడు తామే అవినీతి ఆరోపణల రొచ్చులో కూరుకుపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయమై సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌తో శాంతి భూషణ్‌ ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఈ కేసు నుంచి ఒక ఎస్‌పి నాయకుణ్ణి గట్టెక్కించేందుకు న్యాయమూర్తికి లంచమివ్వాలని సూచించినట్లు, ఈ విషయంలో తన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌ సహకరిస్తాడని కూడా చెప్పినట్లు ఆ సీడీలు వెల్లడించాయి. సమర్థవంతమైన లోక్‌పాల్‌ బిల్లును అడ్డుకునేందుకే ఎవరో ఈ సీడీలు విడుదల చేశారని, ఇవి బోగస్‌ సీడీలని శాంతి భూషణ్‌ ఖండించినా, ములాయంతో మాట్లాడమని శాంతి భూషణ్‌కు ఫోన్‌ కలిపి ఇచ్చిన అమర్‌ సింగ్‌ మాత్రం దీనిని ఖండించేందుకు నిరాకరించారు. ఈ సీడీల వివాదానికి తోడు లోక్‌పాల్‌ బిల్లు ప్యానల్‌లోని ఇతర సభ్యులతోపాటు శాంతి భూషణ్‌ వెల్లడించిన ఆస్తుల వివరాలపై కూడా వివాదం రాజుకుంది. ఆయన తన ఆస్తుల విలువను తగ్గించి చూపారని కొందరు బాహాటంగానే విమర్శలకు చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణల పరంపరతో శాంతి, ప్రశాంత్‌ భూషణ్‌ల ద్వయం ఆత్మ రక్షణలో పడింది. దీంట్లో నిజాల నిగ్గు తేలే వరకైనా ప్యానల్‌ నుంచి తప్పుకుంటే మంచిదని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఈ తండ్రీ కొడుకులిద్దరినీ లోక్‌పాల్‌ బిల్లు ప్యానల్‌లోకి తీసుకోవాలని అన్నా హజారే సిఫారసు చేసినప్పటి నుంచే వివాదాలు కూడా మొదలయ్యాయి. ప్యానల్‌లోకి తండ్రీ కొడుకులను ఇద్దరినీ తీసుకోవడమేమిటని సొంత శిబిరం వారే కొందరు హజారేను ప్రశ్నించారు. ప్యానల్‌ ఎంపికలో పారదర్శకతకు పాతరేశారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు వారిద్దరూ నీతి నిజాయితీలకు మారు పేరని అన్నా హజారే స్వయంగా కితాబిచ్చాడు. అంతకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇలాగే పొగిడారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వామి కావచ్చు కదా అని అడిగితే ఓటర్లు వంద రూపాయల నోటుకి, మద్యం సీసాకు అమ్ముడు పోతున్నారని జనంపై నింద మోపారు. ప్రజలెన్నుకున్న పార్లమెంటు, ప్రభుత్వాలు ఇన్ని ఉండగా, తాము సూచించిన విధంగానే చట్టం చేయాలని పట్టుబట్టడం, ఆ చట్టం ఎప్పట్లోగా తేవాలో కూడా గడువు నిర్దేశించడం ద్వారా హజారే ప్రజాస్వామ్య ప్రక్రియను హైజాక్‌ చేస్తున్నారని హరీష్‌ సాల్వే వంటి న్యాయకోవిదులు వ్యాఖ్యానించడం గమనార్హం. హజారే ఆశయం మంచిదే కావచ్చు, మార్గం కూడా ఉన్నతమైనదిగా వుండాలి. ఆ స్పృహే ఇక్కడ లోపించింది.
హజారే పేర్కొన్నట్లుగా ఓటర్లు అంత అజ్ఞానులే అయితే దేశ లౌకికవాదాన్ని మంటగలిపేందుకు మతతత్వ శక్తులు యత్నించినప్పుడు ఆ శక్తులకు వ్యతిరేకంగా తిరుగులేని తీర్పు ఎలా ఇవ్వగలిగారు? ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టినందుకు ఆమె పార్టీని చిత్తుగా ఓడించింది ఈ ప్రజలు కాదా? 2004 ఎన్నికల్లో భారత్‌ వెలిగిపోతోందంటూ ఊదరగొట్టిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు ఎలాంటి పరాభవం జరిగిందో తెలీదా? ఆధునిక భారత దేశానికి పరీక్ష ఎదురైన ప్రతి సందర్భంలోనూ ప్రజలు లౌకికవాదం, ప్రజాస్వామ్యంవైపే నిలిచారు. ఇవన్నీ హజారే మరచిపోతే ఎలా? లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదాను జూన్‌30 కల్లా ఖరారు చేయాలని, జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చట్టంగా ఆమోదించాలని గడువు పెట్టడం ఏ తరహా ప్రజాస్వామ్యమో ఆయనే సెలవివ్వాలి. అదే సమయంలో హజారే ప్రతిపాదించిన జన లోక్‌పాల్‌ బిల్లులో తీసుకోదగిన కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటూనే దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు ఓపిక పట్టాలి. 1969లో మొరార్జీదేశారు నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిటీ తొలిసారి లోక్‌పాల్‌ బిల్లును తెచ్చింది మొదలు ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఈ బిల్లు పార్లమెంటు చుట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. వామపక్షాలు పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు కోసం మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. 1996లో దేవెగౌడ సారథ్యంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు పెట్టిన షరతుల్లో లోక్‌పాల్‌ చట్టం ఒకటి. ఆ సందర్భంగా లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధాన మంత్రిని చేర్చాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ప్రధానిని కచ్చితంగా చేర్చాల్సిందేనని వామపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే ఆ ప్రభుత్వం అంతర్గత బలహీనతల కారణంగా ఎక్కువ కాలం కొనసాగలేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మళ్లీ 2004లో తొలి యుపిఏ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో వామపక్షాల ఒత్తిడి మేరకు లోక్‌పాల్‌ తెస్తామని హామీ ఇచ్చింది. ఆమేరకు ఒక బిల్లును పార్లమెంటులో పెట్టింది. దానిని పరీశీలన నిమిత్తం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించారు. స్థాయీ సంఘం కొన్ని సిఫారసులు చేసింది. అయినా, అప్పటికీ అవి సంతృప్తికరంగా లేకపోవడంతో తగు మార్పులు చేర్పులు చేసి అర్థవంతమైన బిల్లు తేవాలని నిర్ణయించారు. ఈలోగా ఆ లోక్‌సభ రద్దయింది. లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు దీనిపై సమగ్రమైన చర్చ జరగాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకే వుంది. కాబట్టి రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఇలా అన్ని తరగతులతోనూ చర్చించి, అన్ని కోణాల నుంచి పరిశీలించి పటిష్టమైన బిల్లు తేవాలి.

ఉద్యోగులు, కార్మికులకు ఉరితాడు

  • జీవో నెం 177పై రౌండ్‌టేబుల్‌లో వక్తలు
  • వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 177 జీఓ కార్మిక, ఉద్యోగ వర్గాలకు ఉరితాడు వంటిదని పలు కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి సమ్మె చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్ల డిమాండ్లను ఆమోదించి, సమ్మెను నివారించాలని డిమాండ్‌ చేశారు. 'జీఓ నెంబర్‌ 177ను వెంటనే ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యాన వివిధ కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ సుధాభాస్కర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిజె చంద్రశేఖరరావు, కె విజయకుమార్‌ (బిఎమ్‌ఎస్‌), కె పోలారి (ఐఎఫ్‌టియు), కె సుధీర్‌ (ఎఐయుటియుసి), షమీమ్‌ బేగం (ఐఎన్‌టియుసి), వి గోపాల్‌రెడ్డి (ఛైర్మన్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి), ఎమ్‌ జనార్థన్‌రెడ్డి (చైర్మన్‌, ఎపి పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌), టి సత్యనారాయణ (అధ్యక్షులు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌), ఎన్‌ ఆనందరావు (అధ్యక్షులు, ఎపి రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్‌), ఆర్‌ లకëయ్య (ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌), డి మురళీమోహన్‌ (కార్యదర్శి, ఎపి సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌), ఎస్‌ నిర్మలాదేవి (ఎఎన్‌ఎమ్‌ల అసోసియేషన్‌), సత్యనారాయణ (ఎపిఎన్జీవోస్‌ నాయకులు, హైదరాబాద్‌ సిటీ), సామినేని రామారావు (ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం), టి రామకృష్ణ (ఉపాధ్యక్షులు, ఎపి రైతుసంఘం), ప్రసాద్‌ (డివైఎఫ్‌ఐ), ఎవి నాగేశ్వరరావు, భూపాల్‌, పాలడుగు భాస్కర్‌ (సిఐటియు), తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధాభాస్కర్‌ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు, కార్మికులు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం, దీనికి నిరసనగా వారు చేపట్టే ఆందోళనలు, పోరాటాలను అణగదొక్కేందుకే 177 జీఓను విడుదల చేసినట్లు విమర్శించారు. ఈ జీఓ కేవలం ప్రభుత్వశాఖల్లో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకే పరిమితం కాదని చెప్పారు. ఈ జీఓను ఆసరాగా చేసుకొని ఆయా శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ఫిక్స్‌డ్‌ వేతనం, గౌరవ వేతనం, పారితోషికాలతో పనిచేసే వారిపై కూడా దాడి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా సమ్మె హక్కులేదంటూ ఈ జీఓలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. పిజె చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ముందు వినయవిధేయతలు ప్రదర్శించే పనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చిందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలను అమలుపరచడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను కట్టు బానిసలుగా చేసుకునేందుకే ప్రభుత్వం ఈ జీఓను విడుదల చేసిందని అన్నారు. జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనలు, పోరాటాలను అణచివేసేందుకు, వారిని ప్రజల నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి వేరు చేసేందుకే ప్రభుత్వం 177 జీఓను విడుదల చేసిందన్నారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆర్‌ లకëయ్య మాట్లాడుతూ ఉద్యోగులు క్రమశిక్షణగా ఉండేందుకే ఈ జీఓను తెచ్చామంటూ ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వానికి క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యోగులను తన కాళ్ల కింద చెప్పుల్లాగా ఉంచేందుకే ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందని చెప్పారు. 177 జీఓను ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని కార్మిక సంఘాలూ కలిసి త్వరలోనే పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటాయని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాలని, అందులో తదుపరి ఆందోళనా కార్యక్రమాన్ని ప్రకటించాలను కూడా ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.

ఘనంగా అంబేద్కర్‌ 121వ జయంతి

  • నివాళులర్పించిన రాజకీయ నేతలు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వారికే ఖర్చు చేయాలని డిమాండ్‌
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి ఘనంగా జరిగింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహనికి అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 9.45 నిమిషాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి పేదలకు పంచారు. నిరుపేద మహిళలకు చీరలను పంచిపెట్టారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, శంకర్రావు, సికింద్రాబాద్‌ ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌హైదరాబాద్‌ మేయర్‌ బండ కార్తీకరెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అంబేద్కర్‌కు పూలదండ వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్‌ నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆర్టీసి క్రాస్‌ రోడ్‌ నుండి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి మధు, వై వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పార్టీ నేత రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌లో దళితులకు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో అవినీతి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దళిత,గిరిజనులకే ఖర్చుచేయాలంటూ ఉద్యమం చేపడతామని చెప్పారు. లోక్‌సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డివిఎస్‌ వర్మ, టిఆర్‌ఎస్‌ సీనియర్‌నేత నాయిని నర్సింహరెడ్డి, ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి అంబేద్కర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దంబాల్‌రెడ్డి నివాళులర్పించారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అంబేద్కర్‌కు నివాళులర్పించి మాట్లాడుతూ దళితులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయనకు దండవేసి నివాళులర్పించే నైతిక హక్కు లేదన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఉపాధ్యక్షులు గంగాధర్‌, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, ఉపాధ్యక్షులు ప్రసాద్‌, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు సూర్యారావు, ఉపాధ్యక్షులు మల్లేష్‌ నివాళుర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజ్‌ఠాకూర్‌ అంబేద్కర్‌, ఎస్‌ శ్రీనివాస్‌, ప్రకాష్‌రాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షులు గద్దర్‌, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఎన్‌జివోల సంఘం నేతలు దేవిప్రసాద్‌, కృష్ణయాదవ్‌, గెజిటెడ్‌ ఉద్యోగుల నేత శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కోదంరాం మాట్లాడుతూ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్పూర్తితో అందరూ ముందుకు వెళ్లాలన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ది సాధ్యమనే విషయాన్ని ఆయన ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మట్టి పనులే!

  • అనుసంధానంపై అనుమానాలు
  • ఆసక్తి చూపని ఎంఎల్‌ఏలు
ఎస్సీ, ఎస్టీ కాలనీలపై సర్కారు వివక్ష ఇది. మౌలిక వసతుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాత్రం మట్టి పనులతో సరిపెట్టనుంది. దళిత గిరిజన ఆవాసాల అభివృద్దికోసం ఇటీవల వ్యవసాయ కార్మికసంఘం, కెవిపిఎస్‌ తదితర సంఘాలతో పాటు సిపిఎం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో, శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అనుసంధానం చేసి ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయను న్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ ప్రకటనపైనే అనుమానాలు వ్యక్తమవ ుతున్నాయి. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం ఆ పథకం కింద చేపట్టే పనులకు ఏ ఇతర నిధులను అనుసంధానం చేసినా మట్టిపనులకే పరిమితం చేయాల్సిఉంది. దీనికి భిన్నంగా జరిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులనే దీనికోసం ప్రభుత్వం వినియోగించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కేటాయించిన నిధులే 2009-10 ఆర్థిక సంవత్సరంలో మూడువేల కోట్లరూపాయల దాకా మిగిలిఉంది.

ఆ మొత్తంలో దాదాపుగా 2662 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. 2010-11 ఆర్థిక సంవత్సరలో ఎస్సీ ఉపప్రణాళిక నిధులు దాదాపుగా 4వేల కోట్లు మిగిలినట్టు అంచనా. సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన మొత్తాలను ఇతర పథకాలను మళ్లిస్తున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపాధి హామీ నిధులతో దళిత,గిరిజన ఆవాసాల అభివృద్ధిని ముడిపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలుత ఉపాధిహామి పథకంతో మట్టి పనులు చేసినప్పటికి ఆ తరువాత వీటినుండి శాశ్వత ప్రయోజనం పొందాలన్నా ఇతర నిధులను వినియోగించాల్సిఉంది. ఆ దశలో కూడా సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించడానికి సర్కారు సిద్దపడక పోవడం గమనార్హం. దీంతో చివరకు ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మట్టిపనులు మాత్రమే మిగలనున్నాయి. ఉపాధి హామీతో నేరుగా అనుసంధానానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో మట్టి పనులు చేసిన తర్వాత కాంక్రీటును వేసేందుకు నియోజవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 22జిల్లాల్లో 1500 ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలో ఈ పనులు చేస్తామని వారు తాజాగా చెబుతున్నారు. అయితే ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే సంబంధిత ఎమ్మెల్యేలు అనుమతి తప్పనిసరని తెలిసిందే. అయితే ఈ పనులపట్ల ఎంఎల్‌ఏల నుండి పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం గమనార్హం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగేటప్పుడే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాంబర్‌లో జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉపాధిహామీ పథకంపై అవగాహన సమావేశం జరిపారు.

కానీ ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు శాతం నామమాత్రమే. ఈసమావేశాల్లో హాజరైన ప్రజా పతినిధులు కూడా పలు అనుమానాలను వ్యక్తపర్చినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వందశాతం ఉపాధిహామీ నిధులనే ఖర్చుపెడితే బాగుంటుందని వారు సూచించినట్లు సమాచారం. పైగా తమ నిధులను కేటాయించేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తున్న కూడా నియోజకవర్గ నిధులను ప్రభుత్వం పెద్దగా మంజూరు చేయలేదు. పైగా అరకొర నిధులతో తమ కార్యకర్తలను సంతృప్తి పర్చడమే కష్టమని, ఇక ఉపాధిహామీకి నిధులను కేటాయించడమేమిటని బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఉపాధిహామీకి కేంద్రప్రభుత్వం వేల కోట్ల నిధులను ఇస్తున్నప్పుడు తమ నిధులకు ముడిపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల నిధుల ఉపాధిహామీకి కేటాయించే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ఎంపీ లాడ్స్‌ పరిస్థితి ఇంతే. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీలను గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి అనంతరం తప్పకుండా ఎమ్మెల్యేల ఆమోదం పొందాలి. అంతేకాకుండా మెటిరియల్‌ కంపోనెంటు కింద 5శాతం పూర్తయిన గ్రామ పంచాయతీల్లోనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలను గుర్తించడంలో పలు ఇబ్బందికర పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌సి ఉపప్రణాళిక ఖర్చు ఇలా (ప్రభుత్వ లెక్కల ప్రకారం ... కోట్ల రూపాయల్లో)
సంవత్సరం కేటాయింపు ఖర్చు మిగులు
2007-08 4355.90 3830.16 525.74
2008-09 7630.42 3511.44 4118.98
2009-10 5243.16 2764.79 2478.37
2010-11 6131.39 2521.82 3609.57

సంక్షేమంపై చిన్నచూపు

  • అందుకే మానవ వనరుల అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబాటు
  • మరింత పేదరికంలోకి దళితులు, గిరిజనులు
  • వెల్లడించిన ప్రణాళికా సంఘం
గత రెండు దశాబ్దాలలో సామాజిక రంగానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో, మొత్తం వ్యయంలో శాతంగా తగ్గిపోవటంతో ప్రధాన రాష్ట్రాలలో మానవ అభివృద్ధి సూచిలో రాష్ట్ర ర్యాంకు పడిపోవటానికి దారితీసింది. సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వ ప్రకటనలకు ఈ పరిస్థితి విరుద్ధంగా ఉందని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లని చెబుతున్న పాలకుల మాటల్లోని డొల్లతనాన్ని ప్రణాళికా సంఘం బట్టబయలు చేసింది. గత రెండు దశాబ్దాలలో జిఎస్‌డిపిలో కేవలం 6 నుంచి 10 శాతం మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రికి పంపిన పత్రంలో పేర్కొంది. సామాజిక సేవలకు చేసిన వ్యయం 1980 దశకంలో 6.59 శాతం కాగా, అది 1990 దశకంలో 5.61 శాతానికి, 2000-07లో 5.55 శాతానికి పడిపోయింది. ఈ కాలాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగంపై చేసిన మొత్తం వ్యయం శాతం వరుసగా 46, 42, 35.6గా ఉన్నాయి. 2000-07 కాలంలో విద్య నిమిత్తం చేసిన వ్యయం వాటాలో పెరుగుదల లేకపోగా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాల నిమిత్తం చేసిన వ్యయం తగ్గుదల ధోరణులతో ఉంది. ప్రభుత్వ ఆర్థిక, లక్ష్యాల ప్రాధాన్యతలలో సామాజిక రంగం ప్రాముఖ్యత ఎలా ఉందో ఈ పరిస్థితి సూచిస్తున్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది.

వివిధ రంగాలకు చేసిన ప్రణాళికా కేటాయింపులలో సామాజిక రంగానికి చేసిన కేటాయింపులను తక్కువగా వ్యయం చేసినట్లు, గత ఏడాది ఏప్రిల్‌ మొదటి తేదీ నాటికి మూడేళ్ళ కాలానికి రూ.8,447 కోట్ల మేరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని ప్రణాళికా సంఘం వివరించింది.
మరింత పేదరికంలో ఎస్‌సిలు, ఎస్‌టిలు
రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికి, ప్రాంతీయ వ్యత్యాసాలు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాలు, చాలా అధికంగా సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయని వివరిస్తూ, ఈ వ్యత్యాసాలను పూడ్చటం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి కావాలని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిల్లా స్థూల ఉత్పత్తి గణాంకాల ప్రకారం తలసరి జిడిపి రూ.15 వేలకు తక్కువగా ఉండి, రాష్ట్ర సగటుకన్నా పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉన్న కర్నూలు, నిజామాబాద్‌, అనంతపురం జిల్లాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రణాళికా సంఘం సూచించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులలో పేదరికం పెరుగుతుం డటం ఈ వ్యత్యాసాలలో మరొక పార్శ్యం. దారిద్య్రంలో ఉన్నవారిలో ఎస్‌సిల శాతం 1993లో 26 శాతం నుంచి ఇప్పటికి 30 శాతానికి పెరిగింది. అదే విధంగా, పేదలలో ఎస్‌టిల శాతం 1983-2005 కాలంలో 9 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. పట్టణ పేదలలో ఎస్‌సిల శాతం 12 నుంచి 20 శాతానికి పెరిగింది.
ప్రణాళికా పెట్టుబడి లక్ష్యాన్ని రాష్ట్రం సాధిస్తుందా?
వచ్చే మార్చి నాటికి ముగియనున్న 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రూ.1,47,395 కోట్ల మేరకు (2006-07 నాటి ధరల ప్రకారం) ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ గట్టి కృషి చేయాల్సి ఉన్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో రాష్ట్రం చేసిన ప్రణాళికా పెట్టుబడి వ్యయం రూ.1,10,439 కోట్లు (70.78 శాతం). 11వ ప్రణాళికా కాలంలో జిఎస్‌డిపిలో 9.5 శాతం పెరుగుదలను సాధించాలన్నది లక్ష్యం. కేంద్ర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం జిఎస్‌డిపిలో రాష్ట్రం 2007-08లో 10.75 శాతం పెరుగుదలను సాధించగా, 2008-09లో అది 5.04 శాతానికి, 2009-10లో 5.45 శాతానికి తగ్గిపోయింది. 11వ ప్రణాళికా కాలంలో సాధించగలదని అంచనా వేసిన 8.1 శాతం ఆర్ధిక పెరుగుదల రేటు లక్ష్యాన్ని 12వ ప్రణాళికలో 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికా దృక్పధం పత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రణాళికా సంఘం తెలిపింది.
వనరుల సేకరణకు సంబంధించి, 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో ప్రణాళికా వనరుల నిమిత్తం జిఎస్‌డిపిలో 4 శాతం మేరకు రాష్ట్ర స్వంత వనరుల నుంచి లభించటంతో ప్రస్తుత ఆదాయ మిగులు (బిసిఆర్‌) జిఎస్‌డిపిలో దాదాపు 3 శాతంగా సానుకూలంగా ఉందని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిఎస్‌డిపిలో పన్నుల ఆదాయం 2008లో దాదాపు 8.8 శాతం నుండి 2009-10లో దాదాపు 9.9 శాతానికి పెరిగింది. 2009-10లో జాతీయ సగటు 7.5 శాతం కన్నా ఇది ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ అప్పు జిఎస్‌డిపిలో దాదాపు 31 శాతంగా జాతీయ సగటు 32 శాతం కన్నా తక్కువగా ఉంది. మొత్తం మీద రాష్ట్ర ద్రవ్య నిర్వహణ స్థిరంగా ఉందని, ప్రభుత్వ పెట్టుబడిని మెరుగుపర్చేందుకు వనరులను సమకూర్చేందుకు, కీలక రంగాలలో ఉత్పాదకతకు దోహదం చేయగలదని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. నిర్ణీత లక్ష్యాల మేరకు ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయలేక, పన్నుల భారం పెరచుతూ, మానవ అభివృద్ధి సూచికలో దిగజారుతున్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య నిర్వహణపై ప్రణాళికా సంఘం ఇచ్చిన కితాబు నయా ఉదారవాద సంస్కరణలతో కూడిన దాని అమానవీయ దృక్పథాన్ని వెల్లడిస్తున్నది.

1980 1990 2000-07
దశకం (%) దశకం (%) (%)
సామాజిక సేవలకు
చేసిన వ్యయం 6.59 5.61 5.51
సామాజిక రంగంపై
మొత్తం వ్యయం 46 42 35.6

annaa hazare

అన్నా హజారే నేడు భారత దేశములో జరుగుతున్న అరాచక అవినీతి పై పోరాటాముగా బవించ వొచ్చు.నేడు భారత దేశములో 2 జి స్ప్రేక్తం భారి కుంబ కోణం కామన్వెల్త్  భారి కుంబ కోణం మరియు మహా రాష్ట అధర్ష్ కుంబ కోణాలు వివిధ కోణాలలో భారత దేశము కుంబ కోణాల వుభిలో ఉన్నది.అన్నా హజారే దీక్ష ఇదే సరైనా సమయము.ఇటువొంటి తరుణములో భారత దేశ ప్రతి పౌరుడు అన్నా హజారే దేక్షకు తమ వొంతు కృషి చేయాలి.దానితో పాటు  ప్రతి పౌరుడు విధి విధి గ్రామా గ్రామానా ప్రజలకు తెలియజేషి చైతన్య పరచాలి అంతే కాకుండా యెవరికి తోసినా రీతిలో వారు యి ఉద్యమాన్ని ఉధృతం చేయటమే ప్రతి భారతీయుడి ధర్మము కూడా,నేడు భారత రాజదాని డిల్లీలో అన్నా హజారే చేపట్టినా యి దీక్షను ప్రతి భారతీయుడు ప్రతి గ్రామములో నిర్హంచాలి,అన్నా హజారే డిమాండ్ నెరవేరే వరకు అన్నా హజారే యొక్క గ్రామములో అడుగు పెట్టనని ఒక వేలా ఉద్యమములో మరణిస్తే అంతిమ సంస్కారాలను స్వగ్రామములో నిర్వైంచాలని చేపధము చేసాడు.దేశాన్ని ఉపెస్తున్న అన్నా హజారే దీక్ష అసేతుకం అవినీతి పై మరో స్వసంత్ర్య సమరం అవినీతి పై  బాణం ఎక్కు పెట్టిన భారతీయుడు.ఏడు పదులు వయస్సు మీదపడిన యోధుడు మహా వీరుడు ఇట్టి ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్ మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున పూర్తి మద్దతు తెలుపు చున్నాము.అంతే కాకుండా యి పిలుపును ప్రతి మాదిగ దండోరా  కార్యకర్త తమ దృష్టికి తీసుకొని మద్దతు తెలుపాలని కోరుతున్నాము మీ యొక్క మిత్రుడు బిమనపల్లీ  జయ రాము మాదిగ 

దళిత మహాప్రస్థానం

దళిత మహాప్రస్థానం
-చుక్కా రామయ్య

ఇప్పటివరకు గడిచిన చరిత్రంతా అగ్రకులాల కిందనే నలుగు తూ వచ్చింది. కులం గోడలు కూలగొడతూ కులస్వామ్యా న్ని కూలదోయడానికి నూతన శక్తులు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దొర గడీలను కూల్చిన చేతులతోనే కులం గోడలు కూల్చటానికి సన్నధమై సాగుతున్నారు. ఊరుబైట వాడ ల మూలుగుల్ని వినని చరిత్ర చరిత్రేనా? వెలివాడల్ని పట్టించుకోని సమాజం ఏదైనా అది అగ్రవర్ణ ఆధిపత్య కుల సమాజమే అవుతుంది. అగ్రకుల భావజలం పోవాలి. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసిన మను వ్యవస్థ మసైపోవాలి.

దళితులు మరో ముందడుగు వేశారు. చరిత్ర రచనను ఆధిపత్యం ఆక్రమించుకుంటే ఎవరి చరిత్రను వారే లిఖించుకుంటా రు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఇతరుల లిబరల్ ఔట్‌లుక్‌తో రాజ్యాంగంలో ఎన్నో అ«ధికరణలు వచ్చాయి.14వ అధికరణ అన గా చట్టం ముందు అందరూ సమానులే. 17 వ అధికరణ సకల వివక్షల పైన నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగాల్లో సమానావకాశాలు. 17వ అధికరణ అంటరానితనంపై నిషేధం.

18వ అధికరణ భావప్రకటనా స్వేచ్ఛ. 21వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ. 23 వ అధికరణ బలవంతపు చాకిరీ రద్దు. 24వ అధికరణ 14 ఏళ్ళలోపు పిల్లలను ప్రమాదకరమైన పను ల్లో నియమించడంపై ఆంక్షలు. 39 వ అధికరణ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఆస్తిపై హక్కు. 49వ అధికరణ గౌరవ ప్రదమైన జీవితం. 45వ అధికరణ పిల్లలందరికీ ఉచిత విద్య. 46 వ అధికరణ ప్రత్యేక కమిషన్‌ను నియమించటం. 243 (డి) ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

330, 332 అధికరణలు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించటం. 345 అధికరణం ద్వారా ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఇచ్చిన హామీలు 60 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం ఈ దేశంలో అతిపెద్ద విషాదం. రాజకీయమైన సంకల్పం ఉంటేనే సరిపోదు. దానికి కావల్సిన రాజకీయ కల్చర్ కూడా ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆధిపత్య సంస్కృతే అధికారం చెలాయిస్తుంది. అదే జరిగింది. ఏళ్ల తరబడి ఎదురుచూసీ చూసీ కళ్లు కాయలు కాసినాయి.

తమ కోసం తామే ఉద్యమించక తప్పదని దళితులు ఉద్యమించారు. పాలకుల కళ్ళు తెరిపించారు. కానీ కుల వ్యవస్థ ఆధిపత్యం చాపకింద నీరులాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ ఉద్యమకంప మాదిరిగా సమాజం చుట్టూ కులం చుట్టబడింది. నడిచేందుకు సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ నడవలేని బాటగా అది మారుతుంది. ఆ విధంగా ఏళ్ళు గడిచాయి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులే చైతన్యంతో ప్రశ్నించడమే కాదు, ఉద్యమాలు నిర్మించుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అర్ధ పెట్టుబడిదారీ సమాజంలో ఉద్యమాలు నిర్మించటంలో పేద వర్గాలు ఎన్ని వ్యయప్రయాసలకు గురౌతున్నారో కళ్లారా చూస్తున్నారు. లాకప్‌లో చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఉపవాస దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వ చక్రాలకు ఎదురు తిరిగి అడ్డుపడ్డ వారిని అణచటమే తెలుసు కానీ కదలటం మాత్రం ఈ మొద్దు పాలకులకు తెలియదు.

ప్రతి రాజకీయ పార్టీ దళిత గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఉపన్యాసాలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. కానీ తరతరాలుగా అనుభవిస్తున్న రాజకీయ తాత్త్విక సాంస్కృతిక ఆధిపత్యం వదులుకోవటానికి మాత్రం సిద్ధపడరు. ఈ రథ చక్రాలను కదిలించటానికై తామే పూనుకుని దళిత శక్తులు ముందుకొచ్చాయి. ఇది ఏ రాజకీయ పార్టీ తలపెట్టలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాలో బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం పెనుగులాట జరిగింది. బి.వి.రాఘవులు నేతృత్వంలో సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఆ జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతిపై ఉద్యమించటం జరిగింది.

అదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 30 మంది సైకిల్ యాత్ర చేయటం జరిగింది. మా సమస్యలపై మీరు ముందుకు రావాలని దళితులు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇందుకు నేనే నాయకత్వం వహిస్తానని తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. 76 రోజులు ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

దళితులకు అండగా నిలిచినా ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఈ సైకిల్ యాత్రను సమర్థించారు. ఆయనే ప్రారంభ జెండా వూపారు. జిల్లాలో మొత్తంగా 2291 కిలో మీట ర్లు, 30 మండలాలు, 8 పట్టణాలను సైకిల్ యాత్రలో చుట్టి వచ్చారు. 628 దళిత వాడల గుండా తమ్మినేని దళిత సైకిల్ యాత్ర కొనసాగింది. ఇది మార్పుకు సంకేతం. ఇది కొత్త సంకే తం.

అన్యాయాలు ఇక సాగవని, మా దళిత వాటా మాకిస్తారా? మా వాటాను మేం గుంజుకోమంటారా? అని పెత్తందారీ సమాజాన్ని తమ చైతన్యపు పలుగులతో పొడిచారు. ఇది మహా ఉద్యమమే. అగ్రకుల ఆధిపత్య సమాజం ఇకనైనా మెట్టుదిగి వచ్చి ఆ దళిత చైతన్యాన్ని కౌగిలించుకోవాలి. మాటలు, చేతలు కావాలంటే వేలాది చేతులు కలవాలి. అదే ఆరంభమైంది.

ఈ దళిత ప్రస్థానం కొనసాగాలి. ఆధిపత్య సంస్కృతి కూలిపోవాలి. దళితులు అమాయకులు అనుకుని వారికి కేటాయించిన నిధులను ఇతరత్రాలకు మళ్ళిస్తే వూరుకోమని రాజకీయ నాయకులకు, పాలకులకు ఈ సైకిల్ యాత్ర ఓ హెచ్చరిక చేసింది. దిక్కుమొక్కులేని దళిత జనం ఒక్కసారి గర్జిస్తే ఆధిపత్య కోటలు కూలిపోతాయని చెప్పారు.

దొర గడీలను కూలగొట్టాం. గడీల ముందు పోరుకేకలు పెట్టాం. ఆక్రమించుకున్న దొర గడీలు పగిలి అవి దళితులకు అందుతాయని అనుకున్నాం. ఊరి వెలుపల మూలుగులే మిగిలాయి. ఇప్పుడు దొర గడీలు ఆధునిక ఆధిపత్య కోటలుగా మారిపోయాయి.

దళితులకు కోటా ప్రకారం బియ్యమే మిగిల్చారు. దళితుల వాటా దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరికగా ఆ దళిత సైకిల్ యాత్ర ముందుకు సాగింది. అదే మరో దళిత మహాప్రస్థానం. అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు , అది నా నల్గొండ నియోజకవర్గం నుంచే బయలుదేరినందుకు గర్విస్తున్నాను. మనిషి జీవితాలు ఉద్యమాలతో పవిత్రమౌతాయి. మనమందరం పవిత్రులవుదాం రండి. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకుందాం. పదండి ముందుకు....

-చుక్కా రామయ్య
శాసన మండలి సభ్యులు

పేదల పట్ల ప్రభుత్వానికెందుకింత ఏహ్యభావం?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రైతుల కోసం ఎంతో చేస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కొందరయితే, 2011-12 బడ్జెట్‌ను సామాన్యుడి బడ్జెట్‌ (ఆమ్‌ ఆద్మీ)గా పేర్కొన్నారు. అయితే సవివరమైన విశ్లేషణను చూస్తే ఈ బడ్జెట్‌, పరిశ్రమలో, మౌలికవసతుల కల్పనలో, పెట్టు బడుల మార్కెట్లో, సేవల రంగంలో, గృహ నిర్మా ణంలో పెట్టుబడుల అవకాశాలను పెంచే ఉద్దే శంతో రూపొందించినట్లు అర్థమౌతుంది. వ్యవ సాయంపై కొద్దిపాటి సానుకూల ప్రభావం చూపించే అవకాశం వుంది. బడ్జెట్‌లో కేంద్రీకర ణపై అసమతౌల్యం కారణంగా ధరల పెరుగు దలకు ద్రవ్యోల్బణ ధోరణులకు దారితీసి గ్రామీణ పేదలను ఇబ్బందులలోకి నెట్టేయడం జరుగుతుంది.
వ్యవసాయానికి ఎప్పుడూ జరిగేలాగున ఒక విధాయకంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రు 7,860 కోట్లు, తూర్పుప్రాంతంలో హరిత విప్లవానికి రు 400 కోట్లు, పప్పులు, ఆయిల్‌ పాం, పట్టణ శివారు ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, ముతక ధాన్యాలు, పశుదాణా ప్రోటీన్‌ అనుబంధ ఆహారం కోసం నూతన జాతీయ మిషన్‌కు ఒక్కొక్కదానికి రు 300 కోట్లు చొప్పున ఈ కేటాయింపు లున్నాయి. దేశంలోని 6,00,000 రెవెన్యూ గ్రామాలలోని 75 కోట్ల మంది రైతుల ప్రయోజ నాలు నెరవేర్చేందుకు ఈ కేటాయింపులు నామ మాత్రం.
తక్కువ వడ్డీ రేటుపై రైతులను ఆర్థికంగా కలుపుకొని పోవడంపై పెద్ద పెద్ద హామీలైతే యివ్వ డం జరిగింది. పంట రుణాల వడ్డీపై ప్రభుత్వం అందజేసే 3శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయం, రైతులకు చాలావరకు ప్రయోజనకారి అని ఆర్థిక మంత్రి అంటున్నారు. అయితే ఆయనో విషయం తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన సుమారు 5 కోట్ల మంది చెరకు పండించే రైతు లకు ఈ స్కీం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించటం లేదు. చెరకు అన్నది 11 నుండి 18 మాసాల పంట. ఫ్యాక్టరీలు రైతులకు డబ్బును ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. అందువల్ల రైతులు వడ్డీపై ప్రభుత్వం సహాయక పథకం వల్ల ప్రయో జనం పొందేందుకు, ఒక సంవత్సరంలోగా రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అందు వల్ల పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం రెండేళ్ళ వ్యవధినివ్వాలి.
అవకాశాలకు దూరంగా ఉన్నవారికి, అల్పా దాయ గ్రూపులకు భరించగలిగే ఖర్చుపై ఆర్థిక (బ్యాంకింగ్‌) సేవలు అందించే కార్యక్రమాన్ని (సమ్మిళిత ఆర్థిక వృద్ధి) రైతులకు వర్తింపజేసే టప్పుడు జాగ్రత్తగా రూపొందించాలి. ఆ విధంగా రుణగ్రస్తులైన రైతులు తాము పెట్టిన పెట్టుబడు లకు గిట్టుబాటైన రాబడులను పొందుతూ రుణాలను తేలికగా తిరిగి చెల్లించే స్థితిలో ఉండ గలరు. అయితే ఈ దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఇక్కడ రుణగ్రస్తుడైన రైతు రుణ భారం పెరిగిపోయి తనకు, తన కుటుంబానికి జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు సరిపడు రాబడులను సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది అతనిని నిరంతరం అప్పుల ఊబిలోకి నెట్టేసేలా చేసి, అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. అందువల్ల ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య-తనను తన కుటుంబాన్ని నిర్వహించు కొనేలా సరిపడు రాబడులను రైతుకు లభించేలా చూడడం. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) లో ప్రభుత్వం చేసే మెరుగుదలలు సేద్యం చేయడంలో పెరిగిపోతున్న ఉత్పాదకాల ఖర్చులు తట్టుకునేం దుకు, సానుకూలమైన రాబడి పొందేందుకు ఏమాత్రం సరిపడా ఉండడం లేదు.
అయితే ఆర్థికమంత్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అధికాధికంగా రసాయన సేద్యం వల్ల భూసారపరిస్థితి నానాటికీ క్షీణించిపోతోందని ఆయన అంగీకరించారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది. దిగజారిపోతున్న భూసారం, ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు అవరోధంగా వుంది. అంతే గాక, వ్యవసాయంలో సాంప్రదాయక సేంద్రీయ వ్యవసాయ భూసారాన్ని పునరుద్దరించడమేగాక, అదేసాపేక్షకంగా రసాయన సేద్యం కంటే చౌక.
సేంద్రీయ ఉత్పత్తులకు 3వేల కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ పరిమాణం వుంది. దీని ధ్రువీ కరణ వ్యయం హెచ్చుగా ఉండడంతో మనరైతులు ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. విడివిడిగా రైతులకు సేంద్రీయ ధ్రువీకరణ ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తూ, అతని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే అది వివేకవంతమైన చర్య అవుతుంది. రైతులకు ఎరువుల సబ్సిడీని నేరుగా అందజేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ చర్య. అయితే ఎరువుల సబ్సిడీని దారిద్య్రరేఖకు దిగువన జీవించే రైతులకు మాత్రమే అందజేయా లని ప్రభుత్వం యోచిస్తోంది. ఎరువుల సబ్సిడీని రైతులందరికీ అందజేయాలి. సబ్సిడీ పరిమాణం భూకమతాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఈ మొత్తాన్ని వ్యవసాయదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రైతులందరికీ సబ్సిడీ అవసరం వుంది. అందువల్ల భూకమతాల పరిమితిపై దేశమంతటా ఎటువంటి తేడాలు లేకుండా ఎలా అమలు పరచబడిందో సబ్సిడీ కూడా అలాగే అందజేయాలి. సబ్సిడీని ఎలా వినియోగించా లన్నది రైతు స్వేచ్ఛకే వదిలివేయాలి. అది రసా యన సేద్యం కావచ్చు. సేంద్రియ వ్యవసాయం కావచ్చు. ప్రభుత్వం గనుక సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తే సేంద్రీయ ధ్రువీకరణకు సంబంధించిన హెచ్చు ఖర్చును కూడా కలుపుకుంటూ అదనపు సబ్సిడీని అంద జేయాల్సి ఉంటుంది.
ఇంధనం, ఎరువులు, ఆహారం పై ప్రధాన సబ్సిడీలు 2010-11లో ఖర్చు చేసిన దానికంటే (సవరించిన అంచనా) 2011-12 బడ్జెట్‌లో భారీ స్థాయిలో రు 20,000 కోట్ల కోత విధించబడింది. ఆహార సబ్సిడీలో విధించిన రు 27 కోట్ల కోతతో ఆహారభద్రత, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధి అర్థమౌతుంది. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయాల్సి ఉం టుంది. ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ప్రభుత్వ రైతు వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది.
మెగాఫుడ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగయువకులు చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు యూనిట్లను నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధిస్తుంది. ఈ బడ్జెట్‌ అటవీ వ్యవసాయ దారులు, కొండ ప్రాంత వ్యవసాయదారుల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సాగునీటి సమస్యకు అవసరమైన శ్రద్ధ ఈ బడ్జెట్‌లో కనబడలేదు.
వదులుకున్న రెవెన్యూకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం 2010-11లో మొత్తం పన్ను రాయితీలు రు 5,00,000 కోట్లకు పైగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను మినహాయింపులు రు 88,000 కోట్లకు పైగా వున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇలా భారీ ప్రయోజనాలు అందజేస్తున్న పరిస్థితుల్లో రైతుల పట్ల ఎందుకు పిసినారిలా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సంరక్షణ, విద్య, భరించగలిగే రేట్లపై సరిపడు సౌకర్యాలను అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యం పేదల పట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని వెల్లడిస్తోంది.

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి చట్టం అవసరం

హైదరాబాద్‌ (వివి) : షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) బిల్లును చట్టంగా రూపొందించి ఆ వర్గాలకు నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలని, ఆర్థిక సాధికారతకై జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, అవి దారి మళ్లకుండా పర్యవేక్షక కమిటీలను గ్రామస్థాయిలో పనిచేసేలా చూడాలని వక్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన చర్చలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల సబ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ కె.రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దీనికై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఎస్‌పి కేటాయించిన నిధులలో రూ.21వేల కోట్లు ఇతర శాఖలకు దారి మళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్‌సి సబ్‌ప్లాన్‌ పేర తాను ముసాయిదా బిల్లును రూపొందించి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అందించానని, ఆమె సూచించినా కేంద్రప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సిఎస్‌పికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, జాతీయ అభివృద్ధి మండలి ఈ వర్గాల అభ్యున్నతినే సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామస్థాయిలో సద్వినియోగంకై వేసే పర్యవేక్షక కమిటీలో ఎన్‌జిఒలు, స్థానిక నాయకులు అర్హత గల ఇతరులను సభ్యులుగా చేయాలని కోరారు. నిధులు దారిమళ్లినా, సద్వినియోగం కాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారని పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించి వారిపై కఠినశిక్ష తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్‌ పేర అధికారులపై చర్యలు తీసుకునే వీలుంది తప్ప మంత్రులపై చర్యలు తీసుకోలేమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహారావు మాట్లాడుతూ, ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత కల్పించి నిమ్నవర్గాల అభ్యున్నతికి, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగపు 21, 46 అధికరణల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని చెబుతూ, జస్టిస్‌ రామస్వామి రూపొందించిన ముసాయిదా బిల్లుకు పూర్తి మద్దతు పలికారు. ఎస్‌సిఎస్‌పి నిధుల సద్వినియోగం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాల్సి ఉందని సూచించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వి.రావు మాట్లాడుతూ, ఉప ప్రణాళిక బిల్లును చట్టం చేయాలని, నోడల్‌ వ్యవస్థ ద్వారా దానిని అమలు చేయాలని కోరారు. దళిత వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు. దీనికై చేసిన 50 డిమాండ్లలో తొలి డిమాండ్‌ ఎస్‌సిల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో అభివృద్ధే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ, బిల్లుకు రాష్ట్రస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తే సరిపోదని కేంద్రస్థాయిలో చట్టబద్ధత అవసరమన్నారు. అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై గట్టిగా స్వరాన్ని వినిపించాలని, కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల నిధుల మళ్లింపు జరుగుతోందన్నారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దోపిడీ, అసమానతలు పోవాలంటే బిల్లుకు చట్టబద్ధత అవసరమన్నారు. ఎస్‌సిల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్‌టిల జనాభా 7 నుంచి 9 శాతానికి పెరిగిందని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపు ఆపవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. సిడిఎస్‌ చైర్మన్‌ డా.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మాని సమాజంలో దళితుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని సూచించారు. సిడిఎస్‌కు చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడారు

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము!!ప్రభుత్వ రంగాలలో పోటి పరిక్షలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉన్నతమైన మార్కులు సాదించి మొదటి స్థానములో అర్హత పొందిన జెనరల్ కేటగిరిలో కాకుండా షెడ్యుల్డ్ కులాలకు కేటయించిన స్థానాలలోనే ఉద్యోగాలు ఇస్తున్నారు.ఇదేమిటని ఏయరైన ప్రశ్నయిస్తే ఉద్యోగమూ  కావాలా వద్ద ఎదురు ప్రశ్నలు బెదిరింపులకు పలు పడుతున్నారు.మరి కొంత మంది షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉద్యోగమూ వస్తే చాలు ఎ కేటగిరిలో వస్తేమిటి అనే ఆలోచనలో కూడా ఉన్నారు.షెడ్యుల్డ్ కులాల కోసం కొన్ని వందల సంఘాలు నేడు భారత దేశం,ఆంధ్ర ప్రదేశ్ నుండి ఉన్న యి సంఘాలకు ఇట్టి  విషయాలు ఏమి పట్టవు,కేవలం వారి స్వార్ధలకు ఉపయోగించుకొని షెడ్యుల్డ్ కులాల పై కొంత పట్టు సాదించి కద్దర్ బట్టలు యేసి తిరుగు తున్నారు తప్ప నేడు విద్యార్దులకు జరుగుతున్న  అన్యాయము గురించి ప్రభుత్వాలపై వొత్తిడి తెచ్చి న్యాయము చెయ్యాల్సిన పని ఏ యొక్క షెడ్యుల్డ్ కులాల సంఘాల నాయకులూ చేయడము లేదు.ఉదాహరణ డిఎస్సి  నియమాలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు 90 శాతము మార్కులు సాదించిన  అభ్యర్దులను కూడా షెడ్యుల్డ్ కేటగిరి లోనే అవకాశాలు ఇచ్చారు తప్ప జెనరల్ కేటగిరిలో ఇవ్వటము లేదు.ఇదే  కాకుండా ప్రమోషన్ల విషములో కూడా షెడ్యుల్డ్ కులాల ఉద్య్గులను అనగా తొక్కుతున్నారు.కొన్ని కొన్ని సందర్బాలలో ప్రమాషన్లు జారిచేసే వీదులలో షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు ఉండి కూడా వారి కులము వారికీ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహాయము చేయలేక పోతున్నారు.అంతే కాకుండా ప్రతి షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు తమ కులం వారికీ యిరితో ఏమైనా ఉద్యోగరిత్య అవసరాలు ఉండి వస్తే చులకన భావముతో చూస్తున్నారు యి రకంగా కుడా షెడ్యుల్డ్ కులాలు ఎనుకకు నెట్టి వెయ భాడుతున్నవి,మరో పక్క కొంత మంది  పై స్థానములో ఉద్యోగాలు చేస్తూ షెడ్యుల్డ్  కులాల నిరుద్యోగులను అసరచేసుకొని ఉద్యోగాలు ఇప్పస్తామని మోసాలకు పలు పడుతున్నారు.మరి కొంత మంది ఉద్యోగులు ఉన్నతమైన పదవులలో ఉండి కూడా కానిసం జాతి చేసే ఉద్యమాలలో చేయూతను కూడా ఇవ్వటము లేదు.కొంత మంది ఉద్యోగులు సభ వేదికలలో విబిన్నమైన నీతులు గొప్ప ప్రసంగాలు చేస్తారు.వారిని స్వయంగా కలిసి జాతి కోసం మీ వొంతు చెవా చెయ్యాలన్నప్పుడు కనీసం మాట కూడా మాట్లాడారు.ఇదేమిటి అని అడిగితె మరొక సరి అపైంట్  మెంటు కూడా ఇవ్వరు.మరి కొంత మంది ఉద్యోగులు తన హోదాకు మించి విలాసాలకు పోయి ఖరీదైన  భావనలు కార్లు కొని తలకు మించిన అప్పులు చేసుకొని జాతి మనుగడను కుటుంబ గౌరవాలను మర్చి పోతున్నారు.మరి కొంత మంది వారి పిల్లల వివాహ విషములో తన కంటే 10  అంతాలు డబ్బు ఉన్నవారితో సంబందాలు కలుపు కొని మాకంటే గొప్పవారు లేరని విర్ర  విగుతున్నారు.ఇంకా కొంత మంది పిల్లికి బిచ్చము చేసే వారు కూడా లేరు.వీరిలో కొంత మంది వారి తల్లి తండ్రులను కూడా చూసుకోలేక పోతున్నారు.ఇటువంటి వారు ఉండటము వల్లే నేడు షెడ్యుల్డ్ జాతి యి  స్థానములో ఉన్నది.ఇట్టి విషయాన్నీ షెడ్యుల్డ్ కుల సంఘాల నాయాకులు,ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయాకులు ,మేధావులు అందరు అలోచించి ఇకనైనా ప్రభుత్వముపై వొత్తిడి తెచ్చి విజయము సాదిస్తారని బావిస్తూ ............................... మీ యొక్క మిత్రుడు బి జే ఆర్ మాదిగ  సెల్ నంబర్ 9494443337

రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్



 







మంచి నాయకత్వం కోసం భారత దేశం ఎదురు చూపు ప్రస్తుతం అధికారములో ఉన్న కాంగ్రెస్ పార్టి మల్ల గుల్లలు పడుతున్నది.ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టికి బారిఎత్తున తెలంగాణా సెగ తగులు తున్నది,ఉత్తర ప్రదేశ్ లో బలమైన పార్టీగా B S P అధికారములో ఉన్నది.బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిగఎసి కూర్చున్నది.పచ్చిమ బెంగాల్లో త్రునముల్ కాంగ్రెస్ పార్టి కరకు రాణి కొయ్యగా మమత బెనర్జీ పాగా వేసి ఉన్నది.తమిళ నాడులో ప్రపంచములోనే అతి పెద్ద కుంభ కోణం జరిపిన కరుణా నిదిని 2 జి స్పెక్టం గురించి కనీసం నిలదియలేక పోయింది కాంగ్రెస్ పార్టి మరో పక్క దేశ రాజదాని నడి బొడ్డులో క్రీడ విబగాములో బారి కుంబ కోణాలు వోనికిస్తున్నవి.మహా రాష్ట్రములో సాక్షాత్తు అ రాష్ట ముఖ్య మంత్రి ఆదర్శ లో అవినితులకు పాలుపడి ముఖ్య మంత్రి పదవి నుండి దూరమయ్యారు.ఆంధ్ర కర్ణాటక సరి హద్దులో బారి మైనింగ్ మాపియ జరిగిన బిజెపిని మాటల వరకే విమర్శించిది తప్పా చేతల్లో చేయలేక పోయింది.ఇన్ని కుంబ కోణాలు మరోపక్క  చిన్న రాష్టాల ఉద్యమాలు అవినీతిపై మాజీ ప్రభుత్వ అధికారులు పోరాటాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి,ఇప్పుడు 5 రాష్టాల ఎన్నికలు మరో పక్క కలవార పెడుతున్నవి.2014 లో వొచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు మొదలైనది.రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న సోనియా గాంధీ కోరిక నేర వేరే రీతిలో లేదు.ప్రస్తుతం బిజెపి పార్టి వంశ వారసత్వ రాజకీయాన్ని వ్యతిరెకిస్తున్నది.మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులూ కాకా వెంకట స్వామి గత కొద్ది రోజుల క్రితము నేరుగా సోనియా గాంధీని విదేసురల్లని పిలుపును ఇచ్చాడు.కేంద్రములో బిజెపి పార్టి దళితులకు దగ్గరవుటకు ఆనాడు ఎన్నికలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను ఓడించినది కంగ్రేసాని మాటికి మాటికి దళితులకు తెలియ జేస్తున్నది.ఇటువంటి తరుణములో రాహుల్ ప్రధాన మంత్రి కావటం అనేది అంత తెలికైనా విషయము  కాదు రాహుల్ గాంధీని 2019 ది ఎన్నికలలో నిలబెడితే మంచిదని కాంగ్రెస్ పార్టిలోని కొందరి సీనియర్ నాయకుల అబిప్రాయం,ఇటు మాయావతిని అటు బిజెపిని మిత్ర పక్షాలను మెప్పించి గలిగే నాయకుని కోసం ఎతుకుతున్నది.ఇట్టి సమస్యలను అడిమిన్చాలంటే అన్ని లక్షణాలు ఉన్న నాయకత్వం తప్పని సరి అవసరం కాంగ్రెస్ కు  మరో పక్క మహిళా బిల్లు ఎదురు చూస్తున్నది.నేడు ఉన్న రాజకీయ నాయకులలో అందరిని మెప్పించే ప్రధాన మంత్రికి అర్హత గల ఏకైక నాయకు రాలు  ఉన్నత విద్య రాజకీయ అనుబవం మంచి ఓర్పు సహనం అన్ని బాషలలో మాట్లేడే చక చక్యం.మరో పక్క మహిళాగ  ఉండటము అంతే గాక దళితురాలై ఉండటము ఒక్క మీరా కుమార్ కే కలిసి వొచ్చే అవకాసము మెరుగ్గా ఉన్నది.మీరా కుమార్ ను  కాంగ్రెస్ పార్టి ప్రధాన మంత్రిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి.మీరా కుమార్ నేడు లోక్ సభలో అందరి మన్ననలు పొందినది.అంతేగాక బాబు జగ్జీవన్ రామ్ కూతురు కావటము మరో పక్క దేశములో మీరా కుమార్ ప్రధాన మంత్రి అభ్యర్దిగా వుంటే కాంగ్రెస్ కే ఎక్కువగా కలిసొచ్చే అవకాసము ఉన్నది.2014 లో దళితుల కల నేరా వేరనున్నది.మహిళలకు కూడా ఇక్కడి నుండే మహిళా బిల్లు ఆమోదము పొందినట్టుగా బావించ వొచ్చు ,ఏది ఏమైనా ఒక దళిత జాతి మహిళా మీరా కుమార్ ను  నేడు భారత దేశములో ఎవ్వరు కదాన లేరు. మద్దతు ఇవ్వటానికి చాల పార్టిలు ముందుకు రాగలవు అనే వాదన కూడా ఉన్నది. కాంగ్రెస్ కు యి ఒక్క మార్గము మాత్రమే అధికారాన్ని అంది ఇవ్వగలదని మేధావుల ఆలోచనా ........................బి జయరాము దళిత జాతి విస్లేచాకులు హైదరాబాద్ సెల్ నంబర్ 949444337  

రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్


భారత దేశానికి ఉన్నతమైనా లక్షణాలు గల రాజకీయ నాయకత్వం ఎంతైనా అవసరము వున్నది నేడు భారత దేశము కుమ్బకోనల  మద్య కొట్టు మిట్టాడు తున్నది ఇట్టి తరుణములో నేడు UPA ప్రభుత్వం  కొన్ని రాష్ట్రాల పొత్తు సందర్బంగా దేనిని వదులు కోలేక మంచి  ఆర్ధిక ఎత్తైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో వుండి కూడా ఎన్నో అవినీతి కుంభ కోణాలు జరుగు తున్న పట్టి పట్టనటు వుంటున్నారు దిని అంతటికంటి కారణమూ ప్రధాన మంత్రి పూర్తి అధికారాలు నేడు మన్మోహన్ సింగ్ గారికి లేవన్నవి అక్షర సత్యము నేడు కాంగ్రెస్ కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలనీ ఉన్నదే తప్ప నీతి నిజాయతి రాజకీయ అనుబవము ఉన్న నాయకులను గుర్తుంచి ప్రధాన మంత్రిగా నియమించితే తప్ప భారత దేశము బాగు  పడే దశలో లేదు నీతి నిబద్దత మరియు హిందీ ఇంగ్లీష్ మరి కొన్ని బాషలు,ఉన్నత విద్య కలిగిన దళిత జాతి ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ వారాసురాల్లు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రధాన మంత్రి హోదాకు సరైనా నాయకు రాలుగా నేడు భారత దేశం మొత్తము దళిత జాతి మొత్తము మిలియన్ కండ్లతో నేడు ఎదురు చూస్తున్నది,అక్షర సత్యము...........రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్

బహుజన సామాజిక దృక్పథం

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంతగా ప్రాధాన్యాన్నివ్వదు.

సాహిత్యం విశ్వజనీనమైంది. తీసుకున్న వస్తువు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాం తానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో చెందినట్లు పైకి కనిపిం చినా, దానిలో చెప్పే సత్యం మాత్రం విశ్వజనీనం కావాలి. అలా కానపు డు అది అందరి సాహిత్యంగా కాకుండా, కొందరి సాహిత్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ సమాజంలో జీవిస్తున్న రచయితైనా తన దృక్పథాన్ని బట్టి రచన కొనసాగిస్తాడు. తీసుకొనే వస్తువేదైనా, దాన్ని ఏ లక్ష్యం వైపు తీసు కెళ్తున్నాడో ఆ మార్గమే ఆ రచనా తత్త్వాన్ని, ఆ రచయిత దృక్ప థాన్నీ తెలుపుతుంది. అయినా, సర్వమానవాళికి చెందిన ఒక సామూహిక అనుభవమేదో ప్రతిఫలించగలిగినపడే అది సాిహ త్యమై పరిమళిస్తుంది.

ప్రపంచ సాహిత్యమంతా ప్రధానంగా రెండు మార్గాల్లో నడు స్తుంది. ఒకటి, సమాజాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలకు అనుకూ లంగా మార్చుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడు కునే దృక్పథం. దీన్ని భావ వాద దృక్పథం అని అంటారు. సమా జంలో అపరిష్కృతంగా కనిపించే అనేక క్లిష్ట సమస్యలకు పరి ష్కారాల్ని సూచిస్తున్నట్లుంటుంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజలు చేయడం వల్ల ఆ సమస్యలన్న్లీ తీరి పోతాయని ఈ సాహిత్యం బోధిస్తుంది. తెలుగులో ప్రాచీన సాిహ త్యమంతా ఇంచు మించు ఈ భావవాద ధోరణిలోనే నడిచింది.

మానవుడే అన్నింటికీ కేంద్రమంటూ, అన్ని వర్గాలకూ ప్రాధా న్యాన్నిచ్చే దిశలో, సామాజిక వాస్తవిక దృష్టితో కొనసాగేది ఆధు నిక సాహిత్యం. కాలాన్నీ, సాహిత్య తత్త్వాన్నీ పరిశీలించడం వల్ల నిజమైన ఆధునిక సాహిత్యమేంటో తెలుస్తుంది. భావవాద ఛా యలున్న సాహిత్యం కొంత వెలువడుతున్నా, దానికి మూడు రె ట్లు అధికంగా భౌతికవాద దృక్పథంతోనే ఆధునిక సాహిత్యం వ స్తోంది. సామాజిక వాస్తవిక వాదులు భావవాద దృక్పథంతో వె లువడే సాహిత్యాన్ని తిరోగమన సాహిత్యమనీ, భౌతికవాద దృక్ప థంతో వెలువడే సాహిత్యాన్ని పురోగమన సాహిత్యమనీ వ్యాఖ్యా నిస్తారు.

భౌతికవాద దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మార్క్సిజంలో కనిపిస్తుండడం వల్ల కేవలం దీన్నే ఒక ప్రధాన దృ క్పథంగా భావించడం జరుగుతోంది. దీనిలో వర్గం పునాదిగా ఉంటుంది. ఉపరితలాంశాలన్నీ, సాహిత్య, కళారూపాలతో సహా వర్గ సమస్య పరిష్కృతమైతే, మిగతా అన్ని సమస్యలూ పరిష్కా రమైపోతాయని భావిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. బహుజన దృక్పథంలో వర్గ సమస్యలున్నా, దేశీయ వాస్తవిక సామాజిక దృష్టివల్ల కులం ప్రాధాన్యాన్ని వహిస్తుంది. వర్గ వివ క్షనీ, కుల వివక్షనీ పక్క పక్కనే పెట్టి చూస్తే, కుల వివక్ష మానసిక క్షోభను కలిగిస్తూ, ఆత్మగౌరవ సమస్యని ముందుకి తెస్తుం ది. అందువల్ల కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందువల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాిహత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజన దృక్పథమవుతుంది.

కేవలం తెలుగుసాహిత్యం వరకే చూసినా, మన సాహిత్య చరి త్రకారులు అత్యధికులు నన్నయతోనే సాహిత్య యుగాన్ని ప్రా రంభించారు. అంతకుముందు సాహిత్యం ఉన్నా, గాసట బీసట గా ఉందనీ, లిఖిత సాహిత్యం కావ్యరూపంలో కనిపించ డమనే ది నన్నయతోనే మొదలైందని సిద్ధాంతీకరిస్తున్నారు. అందువల్ల నన్నయకు ముందున్న సాహిత్యాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అం టున్నారు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అను సృజన (ట్రాన్స్‌క్రియేషన్‌ ) చేశాడు. పద్యంలో ఆంధ్ర మహా భార తాన్ని రమణీయంగా వర్ణించాడు.

పద్య రూపంలో ఒక కావ్యం వెలువడాలంటే, నాటి సాహి త్యవేత్తలు పద్యాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యానికి సంసిద్ధులై ఉండాలనే కదా. అంటే అప్పటికే సాహిత్యం చాలా ఉంది. అది పద్య, గద్య, గేయ, వచన రూపాల్లో ఉండే అవకాశం ఉందన్న మాట. దీన్ని శోధించడంతోనే తెలుగు సాహిత్యంలో బహుజన దృక్పథానికి ద్వారాలు తెరిచే అవకాశం ఉంది.సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజు లు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూ పించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగం వరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొ నసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్ప ని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం.

అందుకే 13వ సం పుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసి నా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.పన్నెండో శతాబ్దం నాటి శివకవులలో కూడా కులాన్ని యెడ బాయలేమని ప్రకటించిన వాళ్ళున్నారు. శివకవులు కొన్ని కింది వర్ణాలకీ స్థానం కల్పించినట్లనిపిస్తున్నా, వారినీ తమ మతానికి అనుకూలంగా మార్చుకోవడానికే ఆ భావాల్ని ఉపయోగించు కున్నారనేది బహుజనసాహిత్య దృక్పథం గుర్తిస్తుంది.

16వ శతాబ్దంలో మొల్ల రామాయణం, శ్రీకృష్ణదేవరాయలు �ఆముక్తమాల్యద� రాశారనే విషయాల్లోని వివాదాల్ని కుల దృష్టి తో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వసుచరిత్రికారుడి పేరు గురించిన వివాదం, శూద్రుడు రాసిన కావ్యం కాకి ఎంగిలితో సమానమనీ, దాన్ని చదవకూడదనీ లక్షణాల్ని నిర్దేశించిన 17వ శతాబ్దం నాటి అప్పకవిని గురించి ఆలోచించాలి. బ్రౌన్‌ వెలికి తీసిన వేమననూ, వేమన పద్యాలుగా చలామణిలో ఉన్న ఆధ్యా త్మిక పద్యాల్నీ విశ్లేషించుకోవాలి. వీరబ్రహ్మేం ద్రస్వామి సాిహ త్యం కూడా ఆధ్యాత్మికమైనా, ఆ సాహిత్యంలో కనిపించే ప్రజా స్వామిక భావాల్ని మూల్యాంకన చేసే పద్ధతికీ, సంప్రదాయ సా ిహత్యాన్ని విశ్లేషించే దానికీ తేడా ఉంది. 17, 18 శతాబ్దాల నాటి తెలుగు సాహిత్యాన్ని క్షీణ ప్రబంధ యుగంగా సంభావించడం లోని ఆంతర్యాన్నీ గమనించాలి.

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రో త్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూ లనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగప డాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోస మన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంత గా ప్రాధాన్యానివ్వదు.

తీసుకునే వస్తువుతో పాటు, ఆ వస్తువుకి ఎన్నుకునే రూపాన్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలనేది బహుజన దృక్పథంలో గమ నించాల్సిన మరో ముఖ్యమైన అంశం. మన తెలుగు సాహిత్యం లో పద్యానికి ఒక విశిష్ట స్థానం ఉన్నా, ఆ పద్యం సంస్కృత సమా స భూయిష్టంగా ఉండటాన్నీ గమనించాలి. పద్య కవులు తమ పాండిత్య నిరూపణ కోసం రాస్తున్నారో, పండిత పామర జనరం జకంగా పద్యాన్ని నిర్మిస్తున్నారో పరిశీలించి, పద్యం ఎంతవరకూ ఆదరణీయమో తేల్చుకోవాలి.

గేయం, వచనం కలిగించినంత సత్వర చైతన్యం పద్యం కలి గించలేదు. కానీ, ఒక శాశ్వతమైన అనుభూతిని ఒకటి రెండు వాక్యాల్లో కూడా అందించగల శక్తి పద్యానికి ఉందని గుర్తిం చాలి. వచన సాహిత్యంలో కూడా చిన్న చిన్న వాక్యాలు, సంభాష ణలు, సన్నివేశ కల్పనలు ఉంటాయి. అవి పాఠకుల మనస్సుల్లో శాశ్వతంగా గుర్తుంటాయి. పద్యమా, వచనమా అనే దానికంటే, శక్తివంతమైన వాక్యం ముఖ్యం. అది వచనానికి కూడా ఉంది. రూపకాల్లో వివిధ వస్తువుల్ని తీసుకున్నా, సంభాషణలు, సన్నివేశ కల్పనలు శక్తివంతంగా వర్ణించి, ప్రదర్శించగలిగితే ఈ సాహిత్య రూపాలు కూడా ప్రజల్ని ఆలోచింప జేయగలుగుతా యి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలనుకునే రచయితలు తీసు కునే వస్తువుతోపాటు, సాహిత్య రూపాల్ని కూడా జాగ్రత్తగా ఎ న్నుకోవాలి.

సాహిత్యంలో వస్తువు, రూపం, శిల్పం, ప్రక్రియల పట్ల ఉన్న కొంత అస్పష్టత వల్ల వీటిని సమర్థవంతంగా ఉపయోగించు కోలేని కొంతమంది రచయితలు కూడా కనిపిస్తున్నారు.ఇప్పటికే మార్క్సిస్టుశిబిరాల్లో సాహిత్యపాఠశాలలు కొనసా గిస్తూ, సాహిత్యాన్ని చారిత్రక, భౌతికవాద దృష్టితో చూడ్డం నేర్పా రు. దాన్నింకా కొనసాగిస్తూ, ప్రజాకళారూపాల్ని వాడుకోవడానికీ శిక్షణలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటువంటి శిక్షణనే దళిత సాహిత్యానికి కేంద్రస్థానంగా, మూలస్థానంగా పేరు గాంచిన హైదరాబాదు సెంట్రల్‌ యూని వర్సిటీలో సాహిత్య పాఠశాలలో తరగతుల్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ అసోషియేషన్‌ ఆరంభించింది. దీనిలో ఎంపిక చేసిన కొంతమందికి రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అంశా ల్ని బహుజనదృక్పథంతో అధ్యయనం చేయడమె లాగో శిక్షణ నిస్తుంది. ఇటు వంటి అవగాహనా తరగతుల్ని అన్ని చోట్లా కొన సాగించగలిగితే బహుజనదృక్పథం మరింత వేగవంతంగా ముందుకు రాగలుగుతుంది.

darlaసమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజులు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూపించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగంవరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొనసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం. అందుకే 13వ సంపుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసినా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.

మహిళలకు 50% రిజర్వేషన్లు

మహిళలకు 50% రిజర్వేషన్లు
స్థానికంలో సగం సీట్లు వారికే..
మహిళా సాధికారత పరిరక్షణకు పథకాలు

క్రెడిట్ లింకేజీకి సమగ్ర ప్రణాళిక..
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 3 : పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల అమలుకు చట్టాలను రూపొందించడంపై ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్థానికసంస్థల్లోని అన్ని కేటగిరిలలోనూ 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే రిజర్వేషన్లలో సగం స్థానాలతో పాటు జనరల్ కేటగిరిలోనూ సగంసీట్లు మహిళలకు కేటాయిస్తారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళలకు '1/3 వంతుకు తగ్గకుండా' రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక నుంచి 50 శాతానికి చేరుస్తూ సవరణ చేస్తారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలలో నే రుగా ఎన్నికయ్యే పదవులతో పాటు పరోక్ష పద్ధతిన నియమితులయ్యే మండల, జడ్పీ చైర్మన్ పదవులకూ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఛత్తీస్‌గఢ్, మణిపూర్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, మద్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.

మహిళా సాధికారిత, మహిళల హక్కుల పరిరక్షణ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 లక్షల వరకు గల మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లో కోటి మందికి పైగా సభ్యులున్నారు. ఈ సభ్యుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు రుణ సౌకర్యంతో క్రెడిట్ లింకేజీని ఏర్పాటు చేసేందుకు సమగ్రమైన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. మహిళా సాధికారత కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా సంఘాలకు ఇచ్చే రుణాలపై పావలా వడ్డీ పథకం అమలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అభయ హస్తం పథకం ద్వారా కనీసం రూ.500ల నుంచి రూ.2200ల వరకు నెల వారీ పెన్షన్, ఇందిరమ్మ గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్, దీపం పథకంలో వంట గ్యాస్ కనెక్షన్‌ను మహిళలకు మంజూరు చేయడం, వృత్తి విద్యా కోర్సుల్లో బాలికల కు మూడో వంతు సీట్ల కేటాయింపు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగ స్వామ్యాన్ని సగానికి చేర్చడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో 

లెడీస్ స్పెషల్ మహిళా సంఘాలకు ప్రత్యేక బ్యాంకు

లెడీస్ స్పెషల్
మహిళా సంఘాలకు ప్రత్యేక బ్యాంకు
రాష్ట్రస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు.. నా బార్డు రుణం నేరుగా బదిలీ
వాటి ద్వారానే మహిళలు అప్పులు.. మైక్రో ఫైనాన్స్‌లకూ అడ్డుకట్ట

అయ్యా... బాబూ... మా ఆడపడుచులకు రుణాలివ్వండి! అని బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించడం, పంపిణీ ఎంత వరకు వచ్చిందని అడగడం... ఇలాంటి తంటాలతో పని లేదు. మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు రుణాలిచ్చేందుకు.. మహిళల కోసమే ఓ బ్యాంకు ఏర్పాటవుతోంది.

హైదరాబాద్, ఏప్రిల్ 3 : ఎస్‌హెచ్‌జీలకు ఏటా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారు. అయినప్పటికీ... మహిళలకు పూర్తిస్థాయిలో రుణాలు అందడంలేదు. అనేక మంది బ్యాంకు రుణాలు లభించక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, సూక్ష్మ రుణ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ కష్టాలకు పరిష్కారంగానే 'మహిళా బ్యాంక్' ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ బ్యాంక్ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ)లకు రుణాలు ఇవ్వడం ఒక్కటే ఈ బ్యాంకు పని!

ఎస్‌హెచ్‌జీలకు రాష్ట్రంలో పదేళ్లుగా రుణాలులిస్తున్నారు. గతంలో వెలుగు పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టు వైఎస్ అధికారంలోకి వచ్చాక ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)గా మారింది. రాష్ట్రంలో 9.5 లక్షలకు పైగా ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మహిళా బృందాలకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఏటా వేల కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ఆరేళ్ల క్రితం పావలా వడ్డీ పథకాన్ని కూడా ప్రకటించారు.

2014 నాటికి కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని... తద్వారా కోటి మంది మహిళలను లక్షాధి కారులను చేస్తామని వైఎస్ పదే పదే ప్రకటించే వారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశల వారీగా లక్ష కోట్ల రుణాలను అందించేందుకు వీలుగా అప్పట్లోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

లక్ష్యాలకు అనుగుణంగా రుణ పంపిణీ చేయలేకపోయినప్పటికీ... ఏటా రుణ పరపతిని మాత్రం పెంచుతున్నారు. ఎస్‌హెచ్‌జీలకు 2010-11లో రూ. 7296 కోట్లు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. కానీ... రూ. 7068 కోట్లు మాత్రమే అందించగలిగారు. 2011-12లో మహిళా సంఘాలకు 9100 కోట్లు రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. కోర్ గ్రూపుగా ఏర్పాటు చేసిన బ్యాంకుల ద్వారా ఈ రుణాలు అందజేస్తున్నారు. రుణాల రికవరీ (చెల్లింపులు) ఆధారంగా పావలా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు.

నాబార్డు చెల్లించే నిధులనే బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నాయి. నాబార్డు విధించే వడ్డీకంటే బ్యాంకులు అదనంగా మరింత ఎక్కువ వసూలు చేస్తున్నాయి. పైగా... ఈ రుణాలు పొందడంలో మహిళా సంఘాల ప్రతినిధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ పదే పదే తిరగాల్సివస్తోంది. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. రుణాల కోసం ప్రయత్నించడమే మానుకుంటున్నారు.

చివరికి అధికారులు చొరవ తీసుకుని, బ్యాంకు సిబ్బందికి నచ్చజెప్పి ఎంతోకొంత మేరకు రుణాలు అందేలా చూస్తున్నారు. ఇంత చేస్తున్నా... మహిళలు అప్పు కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించక తప్పడంలేదు. దీంతో ఏటా వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం కన్నా... ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదించింది. నాబార్డు ద్వారా నేరుగా రుణాలివ్వాలని నిర్ణయించింది.

తొలుత రాష్ట్ర స్థాయి ఫెడరేషన్...
ప్రత్యేక బ్యాంకు ఏర్పాటులో భాగంగా... తొలుత రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాల సమాఖ్య (ఫెడరేషన్) ఏర్పాటు చేయాలని సెర్ప్ భావిస్తోంది. ప్రస్తుతం ఒక గ్రామంలో సంఘాలన్నింటినీ గ్రామైక్య సంఘంగా, ఒక మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటినీ కలిసి మండల సమాఖ్యగా, ఒక జిల్లాలోని మండల సమాఖ్యలన్నింటినీ కలిసి జిల్లా సమాఖ్యగా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు... జిల్లా స్థాయి సమాఖ్యలన్నింటినీ కలిపి రాష్ట్రస్థాయిలో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెడరేషన్‌కు నాబార్డు ద్వారా నేరుగా రుణాలు ఇప్పిస్తారు. ఈ విధానంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ నుంచి జిల్లాకు, అక్కడి నుంచి మండలాలకు, గ్రామ సమాఖ్యలకు... చివరగా సంఘాల సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది. వెరసి... బ్యాంకులు చేసే పని, రాష్ట్రస్థాయి మహిళా సమాఖ్య చేస్తుందన్న మాట.

ఎన్నో ప్రయోజనాలు
నాబార్డు ద్వారా నేరుగా మహిళా ఫెడరేషన్‌కు... వారి నుంచి మహిళలకు రుణాలు అందించడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని సెర్ప్ భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా... మహిళా ప్రతినిధులు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.
అవసరమైన నిధులు ఫెడరేషన్ వద్దే అందుబాటులో ఉంటాయి కాబట్టి... రుణ పంపిణీలో ఆలస్యం జరగదు. నాబార్డు లెక్కల ప్రకారం వడ్డీ సైతం తక్కువగానే ఉంటుంది. తద్వారా పావలా వడ్డీ భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో... సాధ్యమైనంత త్వరగా మహిళా ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో 

తల్లి బాధ్యత కొడుకులదే....

తల్లి బాధ్యత కొడుకులదే....సూర్య దిన పత్రిక సౌజన్యముతో 
నాకు నలుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు. నా వయస్సు 65 సంలు. నా భర్త మరణించాడు. కొడుకులు, కూతుళ్ళు అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. అందరూ నా భర్త సంపాదన మొత్తం పంచుకోవాలని వేరు పడిపోయారు. ఇప్పుడు నా బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఊళ్ళో పెద్దలు ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎలా బతకాలో తెలియడం లేదు. దీనికి పరిష్కారం చెప్పండి?
- జయమ్మ, వనపర్తి

law-img అమ్మా! నీకు నీ కొడుకుల సంపాదనలో కొంత మనోవర్తి అడిగే అధికారం ఉంది. కనుక దగ్గరలోని ఒక న్యాయవాదిని కలిసి నీ కొడుకుల (నలుగురు) మీద మనోవర్తి కింద ఐపిసి 125 ప్రకారం గాని లేదా గృహ హింస మహిళల రక్షణ చట్టం 2005 కింద గాని కేసు పెట్టవచ్చు. ఇది నలుగురి మీద గాని లేక ఏ ఒక్కరి పైన గాని పెట్టవచ్చు. నీకు తిండి, బట్ట, నివాస గృహం, వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా కోర్టు ద్వారా రాబట్టుకొనే అధికారం చట్ట ప్రకారం ఉంది.
***
నాకు 1989లో వివాహం అయింది. నాకు ముగ్గురు కొడుకులు కలిగారు. 2008లో నా భార్య పక్కింటివానితో పరిచయమేర్పరచుకుంది. నాటి నుండి నన్ను, నా పిల్లలను మానసికంగా, ఆర్థికంగా, అన్ని విధాలా ఇబ్బందులు పెడుతోంది. తర్వాత నా భార్య గర్భవతి అయింది. తాను పక్కింటి అబ్బాయిని ప్రేమించానని, అతన్ని వివాహం చేసుకున్నానని బంధువులకు చెప్పింది. ఒక గుళ్ళో పూజారి సమక్షంలో పెళ్ళి జరిగిందని చెప్తోంది. తర్వాత చెప్పకుండా పక్కింటి అతనితో వెళ్ళిపోయింది. పిల్లలను నా దగ్గరే వదిలిపోయారు. తర్వాత ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు నా పై వరకట్న కేసు, గృహ హింస కేసు, మనోవర్తి కోసం కేసులు పెట్టింది. దీనికి పరిష్కారం చెప్పండి.
- కృష్ణారావు, హైదరాబాద్‌

నీ భార్యకు పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వివాహేతర సంబంధం ఉన్నట్టు చట్టానికి ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకపోతే నీవు ఏమీ చేయలేవు. కనుక వెంటనే ఒక పోలీసు కేసు పెట్టండి. అప్పుడు పోలీసు వారు విచారణ జరిపి సాక్షాలతో విచారణ రిపోర్టు తయారు చేస్తారు. దీని ఆధారంతో నీ బార్యపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీ భార్య పక్కింటి అబ్బాయిని గుళ్ళో వివాహం చేసుకుంది అన్నందున ఆ ఆలయ కమిటీ నుంచి లేఖ తీసుకోండి. అంతేకాక పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం కారణంగా కన్న పిల్లల పుట్టిన సర్టిఫికెట్‌ తీసుకోగలరు. అదే విధంగా మీ భార్య‚ పక్కింటి అతనితో దిగిన ఫోటోల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మీ దగ్గరలోని న్యాయవాది ద్వారా కేసు పెట్టగలరు. వీటి ఆధారాలతో నీపై పెట్టిన కేసులు నిర్వీర్యం అయ్యి నీకు న్యాయం జరుగుతుంది.
***
నేను 1998వ సంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. నాది ఎస్సీ కులం, నా భర్త బ్రాహ్మణుడు. నాతో వివాహా న్ని నా భర్త తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇందువల్ల మేమిద్దరం ఇంతకాలం పక్కనే కలదిండిలో నివాసం ఉంటూ ప్రైవేటు పనులు చేసుకొని బతుకుతున్నాము. మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఇప్పుడు మా అత్తమామలు తమకు గల ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముతున్నారు. ఆ విషయంలో తన వాటా గురించి నా భర్త ప్రశ్నించగా, నీ భార్య ను, పిల్లలను వదిలి వస్తేనే భాగం ఇస్తాము లేకపోతే ఒక్క పైసా కూడా ఇవ్వం అని భయపెడుతున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి.
- శ్రీదేవి, కృష్ణాజిల్లా

నీకు కులాంతర వివాహం చేసుకున్నంత మా త్రాన ఆస్తి మీకు రాకుండా పోదు. మీరిద్దరూ రిజిస్టర్డ్‌ వివాహం చేసుకున్నారా లేక గుళ్ళోనా అనే విషయం చెప్పలేదు. ఏది ఏమైనా నీవు నీ భర్త కలిసి దిగిన ఫోటోలు, పెళ్ళి కార్డు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవి మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. అవి మాత్రమే ఆధారాలు కాగలవు. లేకపోతే సమస్యలు వస్తాయి. వాటి ఆధారంతో నీ భర్త ద్వారా నీకు దగ్గరలో గల న్యాయవాదిని కలిసి పార్టీషన్‌ కోసం కోర్టులో కేసు వేయగలరు. తప్పక మీకు న్యాయం జరుగుతుంది.
bala-bhramachari

సంక్షేమం' లేని అంగన్‌వాడి

సంక్షేమం' లేని అంగన్‌వాడ Buzz up!

కార్యకర్తల నెత్తిన బండచాకిరి..!
(ఎర్రోజు శ్రీనివాస్‌ వి.వి, కరీంనగర్‌)
నేటి బాలలే రేపటి పౌరులన్న స్పృహతో భారీ బహుముఖ వికాసా నికి ప్రభుత్వాలు వెచ్చించే ప్రతి రూపాయి భారతావని బంగరు భవితవ్యానికి అమూల్యమైన పెట్టు బడి. శిశు జననం నుంచి సంపూర్ణ మానవుడిగా ఎదుగుదల కోసం సమస్త సేవలు సమకూర్చాలన్న 1974 నాటి జాతీయ విధాన పత్రంలో పొంగులు వారింది. అదే స్ఫూర్తి, ఆ స్వప్నం సాకారం చేయ డానికే అవతరించిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం( ఐసిడిఎస్‌) వాస్త వంలో ఎలా నీరోడుతున్నదో డిమాండ్ల సాధన పేరిట తరచూ రోడ్డెక్కాల్సి వస్తున్న అంగన్‌వాడి సిబ్బంది దురావస్తే కళ్ళకు కడు తుంది. అప్పటికీ గండం గట్టెక్క డానికి నాయకుల కంటి తుడుపు హామీలు, బుడిబుడి దీర్ఘాలతో పరిస్థితి అమాంతం సానుకూల పడుతుందన్న భ్రమలు ఎవరికీలేవు. దేశవ్యాప్తంగా 22 లక్షలమంది అంగన్‌వాడి కార్మికులకు వేతనాలు రెండింతలు పెంపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ బడ్జెట్‌ మోతెక్కించటం తెలిసిందే. ఏప్రిల్‌ 1వ తేదీనుంచి అమలవుతుందన్న పెంపుదల ప్రకారం సహాయకుల కొత్తవేతనం నెలకు రూ||లు 1500, కార్యకర్తలకు రూ||లు 3000. నిత్యా వసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతున్నపుడు అరకొర రాబడితో బతికేదెలాగని అంగన్‌వాడి సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. రాష్ట్ర నలుమూ లలనుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన కార్మికులు, కార్యకర్తలు, సహాయకులు, పాతబాకీలు తీర్చా లని, సహేతుక జీతభత్యాలు ఇవ్వా లని గళమెత్తడం వెనక విస్తృత నేప థ్యం ఎంతో బాధాకరం. తమను కనికరించడంతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లోని పిల్లలకు మధ్యాహ్నవేళ తిండి ఏర్పాట్లు చూడాలని, పౌష్ఠికా హార పంపిణీ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టరాదన్న డిమాండ్లు వేళ్ళు తన్నుకున్న ఆ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. సిబ్బంది తీవ్ర అసంతృప్తితో దహించుకు పోతుండగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఇవ్వాల్సిన టీకాలు, రక్తహీనతకు గురికాకుండా గర్భవతులకు, కిషోర బాలికలకు మందుల పంపిణీ చాలాచోట్ల కాగితాలకే పరిమితమవుతున్నాయి. అందుకే పిల్లల ఆరోగ్యకర ఎదుగుదల ఎండమావిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా సమీకృత ఘోరవైఫల్యాన్ని జనార్ధన్‌ ద్వివేది సారథ్యంలోని పార్లమెంటరీస్థాయి సంఘం ధృవీకరించింది. తన వంతుగా సర్వోన్నత న్యాయస్థానం అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ ఎందుకిలా చతికిల పడిందని కేంద్రాన్ని సూటిగా నిగ్గతీసింది. నేటికీ సరైన దిద్దుబాటు చర్యలే కరువు! ప్రపంచంలోనే అతి పెద్ద పోషకాహార పథకం, అనునిత్యం ఏడు కోట్లకుపైగా పిల్లలకు సుమారు కోటిన్నర మంది బాలింతలకు, గర్భిణీలకు పది లక్షల కేంద్రాలలో ఆసరాగా నిలుస్తుందన్న గణాంకాలవల్లే వెతతో సర్కారు మురిసిపోతున్నది. ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య సుమారు 17 కోట్లని అంచనా. వారిలో యాభై శాతానికైనా రక్షణ లేదు! ఐసిడిఎస్‌ను సార్వత్రీకరించడానికి అదమపక్షం 14 లక్షల అంగన్‌వాడి కేంద్రాలు నెలకొల్పాలన్నది నాలుగేళ్ళనాటి సుప్రీం సూచన. ఆ స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లకు అవకాశం, సన్నద్దత కనుచూపుమేరలో కానరావడంలేదు. ప్రతిష్టాత్మక పథకం పది, పదకొండు కోట్లమంది పిల్లలను గాలికొదిలేసిందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగే లెంపలేసుకున్నారు. పిల్లల్ని జాతి సంపదగా పరిగణిస్తున్నామని, వారి అభ్యున్నతికి చేయగలిగినంత చేస్తామని బులిపించిన యుపిఏ నాయకగణం, సమస్య మూలాలపై దృష్టి సారించడమేలేదు. నిర్ధిష్ఠ కాల వ్యవధిలో విస్తరణ వ్యూహాల మాట దేవుడెరుగు, ఇప్పటికే నడిపిస్తున్నామన్న అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ పరమ అధ్వాన్నం. దేశీయంగా పిల్లల మరణాలలో సగందాకా పోషకాహార లోపాల వల్లే సంభవిస్తున్నాయన్న అధ్యయనాలు- ఐసిడిఎస్‌ లోపభూయిష్టమని నిర్దారించాయి. సబ్బందిని పస్తులు పెట్టి, అధికారుల పర్యవేక్షణను నామమాత్రం చేసి పోషకాహార నిలువలని పక్క దారి పట్టిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలోనే తిష్టవేసింది. ప్రతి వేయి మంది జనాభాకు ఒక అంగన్‌వాడి కేంద్రం నెలకొల్పాలని గిరిజన ప్రాంతాల్లో 700 మందికి ఒక కేంద్రం పనిచేసేలా చూడాలన్నది సర్వోన్నత మార్గదర్శక సూత్రం. మంజూరైన కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వాల అసమర్ధతే దేశంలో సంక్షేమ భావనకు అతిపెద్ద విఘాతం. గర్భిణులకు, బాలింత లకు, కిషోరబాలికలకు సంవ త్సరంలో కనీసం మూడువందల రోజులపాటు సరైన పోషకాహారం అందించాల్సిన బాధ్య త ప్రభుత్వాల దేనన్న సుప్రీం తీర్పు, దేశ రాజధా నిలోనే కొళ్ళబోతున్నది. అక్కడి కొన్ని కేంద్రాల్లో లబ్ధిదా రులకు ఏడాదిలో సగటున 150 రోజులపాటు ఆహార పంపణీకి దిక్కులేదని లోగడే వెల్ల డైంది. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి కావ లసిన సంబరాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో దండిగా పోగుప డ్డాయి. రాష్ట్రంలో ఏటా పదహారు లక్షల మేరకు జననాలు నమోదవు తుండగా, లక్ష మంది శిశువులు పొత్తిళ్లలోనే మరణి స్తున్నారు. 61 శాతం పిల్లలకు పౌష్ఠికాహారం లభించడంలేదు. 71శాతం బాలలు రక్తహీనతతో సతమతమవుతున్నారు. పేరుకు 80 వేలకు పైగా అంగన్‌ వాడీలు మంజూరైనా అధికారికంగా నిర్వహి స్తున్నవి 70 వేల లోపే. పర్య వేక్షణా అధికారుల నియామకాల్లో పీనాసితనం, నిఘాకు తూట్లుపొ డుస్తున్నది. ఇరుకు అద్దె భవనాలు, సిబ్బంది కొరత, తూతూ మంత్రంగా కేంద్రాల నిర్వహణ, గౌరవ వేత నాలను ఆరేడు నెలలకు విదిలించ డం, అనేకానేక రుగ్మతలకు అంటుక డుతున్నట్లు సామాజిక తనిఖీలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో జరిగే కార్య క్రమాలన్నింటి పని భారాన్ని అంగన్‌వాడి కార్యకర్తల నెత్తిన రుద్దేసి బండ చాకిరి చేయించు కుంటూనే, వారికి తగిన పరిహారం ముట్టచెప్ప కపోవడం అమానుషం.
కేంద్రాలలో సంక్షేమం వాలిపో వడానికి అదే మూలకారణం. కనీస వేతన చట్టాన్ని అపహసిస్తూ సర్కారు సాగిస్తున్న శ్రమదోపిడీకి అడ్డుకట్ట పడినప్పుడే అంగన్‌వాడీలకు స్వాంతన, కేంద్రాలలో మౌలిక లోటుపాట్లను సరిదిద్ధిన్నాడే అసంఖ్యాక భావిపౌరుల బతుకుల్లో వెలుగురేఖలు వెదజల్లుతాయి.

భూ పోరాటాలకు మార్గదర్శి

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మన పాలకులు భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు. అనేక చట్టాలు చేశారు. అయినా ఇప్పటికీ భూస్వామ్య విధానం అంతమవ్వలేదు. దున్నే వాడికి భూమి లభించలేదు. 1970లలో అమరజీవి కామ్రేడ్‌ సుందరయ్య భారతదేశం-భూసమస్య అన్న తన చిన్న పుస్తకానికి పరిచయం రాస్తూ పై మాటలు చెప్పారు. వాస్తవానికి భూసమస్యకి కామ్రేడ్‌ సుందరయ్య జీవితమే అద్దం పట్టింది. వ్యవసాయ సంబంధాలపై శాస్త్రీయ అవగాహనతో రూపొందించుకున్నది ఆయన వైఖరి.అసమాన త్యాగాలలతో, అకుంఠిత దీక్షతో రైతులు, భూమిలేని నిరుపేదలు, వ్యవసాయకార్మికులను, అర్ధబానిస పెట్టుబడిదారీ దోపిడీ నుండి విముక్తి చేయడానికి ఆయన కృషి సల్పారు. కామ్రేడ్‌ సుందరయ్య మరణించిన కొద్దిరోజులకు 'మెయిన్‌స్ట్రీమ్‌' పత్రికలో ఆ సంపాదకుడు నివాళులర్పిస్తూ సుందరయ్య 'కమ్యూనిస్టు ఋషి' అని పేర్కొన్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగంలో భూ యాజమాన్యం గురించి చూద్దాం. కామ్రేడ్‌ సుందరయ్య చెప్పిన పరిస్థితి 1970 దశకంలో ఏమైనా మార్పు చెందిందేమో పరిశీలిద్దాం. 1970-71లో చిన్న, సన్నకారు రైతులకు మొత్తం కమతాల్లో 65 శాతం ఉండగా, వారి ఆధీనంలో 12 శాతం భూమి మాత్రమే ఉంది. నాలుగు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 30 శాతం భూమి ఉంది. 1981లో చిన్న, సన్నకారు రైతులు 72శాతం ఉండగా, వారి ఆధీనంలో 29శాతం భూమి ఉంది. రెండు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 18 శాతం భూమి ఉంది. 1970 నుండి 1980 వరకు భూసంస్కరణల వల్ల పెద్దరైతుల పట్టు కొంత సడలినట్లు కాగితాలపై కనిపిస్తుంది. కానీ వాస్తవంలో వారి పట్టు ఏమాత్రం తగ్గలేదు.
ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ పార్థసారథి పరిస్థితిని చక్కగా క్లుప్తీకరించారు.

'సీలింగ్‌ చట్టాల కింద 1984 వరకూ 1.32లక్షల హెక్టార్ల భూమిని మాత్రమే పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 0.1శాతం మాత్రమే. పంపిణీ చేసిన దానిలో కూడా 93.7శాతం మెట్టభూమి. 1969 నుండి 12.62లక్షల బంజరు భూమిని చిన్న, సన్నకారు రైతులకు పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 8.7శాతం అని చెపుతున్నారు. చట్టాల్లోని లొసుగుల వల్ల భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం, కౌలుదార్లకు భూస్వాముల నుండి రక్షణ కల్పించడం అనే ప్రధాన ధ్యేయాలు నెరవేరలేదు. పేద రైతులకు రుణసౌకర్యం, మెరుగైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించి, ఉత్పాదకతను పెంచలేకపోయారు. వీటన్నింటికీ రాజకీయ చిత్తశుద్ధి లోపించడమే కారణం. ఇది గ్రామీణ ప్రాంతాలలో ధనిక, భూస్వామ్య పెత్తనంతో ముడిపడి ఉంటుంది. పాలకవర్గాలు తన స్వభావరీత్యా పేద, సన్నకారు రైతులకు లాభించే చర్యలు గైకొనడానికి ఇష్టపడవు. ఇది ప్రస్తుత వాస్తవ పరిస్థితి. పంటలు అధికం చేయడానికి చర్యలు గైకొన్నప్పటికీ వాటి ఫలితం కొద్దిమందిగా ఉన్న ధనిక, భూస్వామ్య వర్గాలకు మాత్రమే దక్కింది. చిన్న, సన్నకారు రైతులు అంతకంతకూ దివాళా తీసి, వ్యవసాయకార్మికుడిగా మారిపోవడం పెట్టుబడిదారీ విధానం సూత్రాల్లో ఒకటి. అడవుల పెంపకం, పండ్ల తోటల పెంపకం, కోళ్ల పెంపకం మొదలైనవి ఇటీవలి కాలంలో పెరగడాన్ని ఇదే సూచించిస్తోంది. ధనికరైతులు పనివారిని అధికంగా వినియోగించే పద్ధతులు లేకుండా పెట్టుబడి అధికంగా వినియోగించే పద్ధతులు వ్యాపార ప్రాతిపదికపై పండ్ల తోటల పెంపకం మొదలైనవాటికి మారుతున్నారు. సామాజిక పరిశీలకులకు ఇది ఆశ్చర్యం కలిగించదు.

గిరిజనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 1970 నుండి పది సంవత్సరాల కాలంలో గిరిజనుల ఆధీనంలో ఉన్న అత్యధిక భూమి గిరిజనేతరుల చేతుల్లోకి మారింది. ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, శాంతిభద్రతల సమస్యకు కారణమవుతుంది. భూ యాజమాన్యంలో అసమానత నీటిపారుదల సౌకర్యాల వినియోగం అసమానతలకు కూడా కారణమవుతున్నాయి. కమాండ్‌ ఏరియాలకు దగ్గరగా ఉన్న రైతులు సేద్యపు నీటి సౌకర్యాలను అధికంగా వినియోగించుకుంటున్నారు. ఫలితంగా భూ వసతి కలిగిన వారికి, భూమిలేని నిరుపేదలకు మధ్య వ్యత్యాసం మరింత అధికమైంది. ఐదవ ప్రణాళికాంతం నుండి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం వల్ల పేద ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నమైంది. పౌష్టికాహారలోపం, నిరక్షరాశ్యత, పసిబిడ్డల అధికచావులు ఇలాంటి రుగ్మతలకు గురయ్యే దశలో బలహీనవర్గాలే రాష్ట్రంలోని అత్యధిక ప్రజానీకమైన బడుగుజనాల స్థితికి ఇవే సూచికగా ఉన్నాయి.
మన విధాన నిర్ణేతలు పెద్ద పెట్టున ప్రచారం చేస్తున్న సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడం, భూ యాజమాన్యం పరిస్థితిపై ఎంతో ఆధారపడుతుంది. ఉత్పత్తిశక్తులు ఉత్పత్తి సంబంధాలను సక్రమ పద్ధతిలో ఉంచాలంటే దున్నేవానికి భూమి లభించాలి. ఈ సమస్యను ఇంకెంతమాత్రం అలక్ష్యం చేయరాదు. లేనట్లయితే మొత్తం దేశ స్థితిగతులే విచ్ఛిన్నమౌతాయి. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి తగినంతగా కృషి చేయవచ్చు. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌, కేరళ, వామపక్ష ప్రభుత్వాలు రుజువు చేస్తున్నాయి. దానినే ఈ రాష్ట్రంలో కూడా సాధించుకోవచ్చు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే పురోగామి ప్రజాశక్తులన్నింటితో కూడిన ఉద్యమం అవసరం. ఇటువంటి ప్రజాతంత్ర ఉద్యమం కోసం మనం పునరంకితమవుదాం. ఇదే కామ్రేడ్‌ సుందరయ్య స్మృతికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి.ప్రజా శక్తీ దిన పత్రిక soujanyamutho
ముఖోపాధ్యాయ