ప్రపంచ అమ్మ దినోత్సవ శుభాకాంక్షలు

ఎస్సీ, ఎస్టీల గోడు పట్టని సర్కార్‌                                                                          కమిషన్‌కు ఛైర్మన్‌ కరువు

  • 19,413 కేసులు పెండింగ్‌
  • హామీలు బుట్టదాఖలు
దళితులు, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోంది. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం, ఎక్కడైతే దళితులు అణచివేతకు గురువుతున్నారో అక్కడ చైతన్యం తీసుకురావడం, వారి హక్కులను కాపాడటం, వివక్షతకు గురైతే తగిన న్యాయం చేయడం తదితర బాధ్యతలను కమిషన్‌ నిర్వర్తిస్తుంది. ఈ కమిషన్‌కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాల్సి ఉంది. వివిధ దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు కూడా న్యాయమూర్తినే ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. కానీ, ప్రభుత్వం ఈ నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్‌ మెరుగు నాగార్జునను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారు.
నాగార్జున ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందనే కాకుండా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 23,773 కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం 4,360 (19 శాతం) కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలినవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నాగార్జున తన వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్‌ పదవికి 2009లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. ఛైర్మన్‌ను నియమించకపోవడానికి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఆందోళన కూడా ఒక కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులత్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించినా ఇబ్బందులెదురవుతాయనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే సమయంలో దళిత, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో నారాయణవనం మండలం, బొప్పరాజుపాళ్యంలోని లక్షీపురం గిరిజన కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు స్వాతంత్య్రం రాకముందు నుంచి 278 సర్వే నెంబరులోని 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. సజ్జలు, జొన్నలు, కందులు, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి పట్టాలివ్వాలి. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
మరోవైపు దళిత, గిరిజనులపై అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండంలోని దళితులు భూములను అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారనే అక్కసుతో నలుగురిని సజీవదహనం చేశారు. సజీవదహనం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కమిషన్‌ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుందని ఎస్సీ,ఎస్టీ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. బాణామతి. చేతబడులు చేస్తున్నారనే నెపంతో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
దీక్షతో దిగొచ్చినా...
దళిత, గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆ పార్టీ ఇతర నేతలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మార్చి 17న దీక్ష చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శాసనసభలో రెండు రోజలుపాటు చర్చ జరిగింది. ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా రాఘవులు పెట్టిన డిమాండ్లలో సాధ్యమైనన్ని పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. దాదాపు రెండు నెలలు పూర్తికావస్తున్నా ఏ ఒక్క సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించలేదు.

హైకమాండ్‌కు మూడ్ వచ్చింది
త్వరలో మూడు కీలక పదవుల భర్తీ
డిప్యూటీ సీఎం రేసులో రాజనర్సింహ ముందంజ

నాదెండ్లకే స్పీకర్‌గా పదోన్నతి!
ఇంకా తేలని కొత్త పీసీసీ చీఫ్
నేడు ఢిల్లీకి డీఎస్.. ఆజాద్‌తో భేటీ
కడప ఫలితాల తర్వాత ఢిల్లీకి సీఎం
న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 7 : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. చాన్నాళ్లుగా నాన్చుతూ వస్తున్న డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవుల భర్తీతో పాటు పీసీసీ సారథ్య బాధ్యతలను కొత్త నేతకు అప్పగించే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు మొదలెట్టింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«ధీని శనివారమిక్కడ కలిశారు. పార్టీ వ్యవహారాలు, తెలంగాణ అంశాలపై ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి కోర్‌కమిటీ సభ్యులతో శుక్రవారం చర్చించిన సీఎం.. సోనియాతో జరిపిన సమావేశంలోనూ ఆ అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు.

ఉప ఎన్నికల తరువాత పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడదామని సీఎంకు సోనియా ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే.. సీఎంతో సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగర్వాల్‌లు సోనియాతో సమావేశమయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన ఎన్ఎండీసీ వివాదం పరిష్కారంలో అలసిపోయిన సోనియా.. సీఎం కిరణ్‌తో జరిగిన భేటీలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూలంకషంగా మాట్లాడలేకపోయారు.

ఈ భేటీలో కడప ఉప ఎన్నికల గురించే ప్రస్తావనకు వచ్చిందని.. ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగలేదని పార్టీ వర్గాల వివరించాయి. కడప ఫలితాల తర్వాత సీఎం కిరణ్ మరో మారు ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై అధిష్ఠానం దృష్టి సారించనుంది. కాగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ భేటీలో వీరు రాష్ట్ర వ్యవహారాలపై సమగ్రంగా చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో అగ్రస్థానంలో రాజనర్సింహ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇన్నాళ్లూ తనమునకలైన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటుండడంతో.. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ అంశంపై అటో ఇటో తేల్చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధిష్ఠానానికి ఇచ్చిన అల్టిమేటం.. దానిపై మే రెండో వారంలో మళ్లీ భేటీ అవుదామంటూ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలపై అధిష్ఠానం దృష్టిసారించనున్నది. స్పీకర్, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిర్ణయంలో అధిష్ఠానం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి లభిస్తుందనీ స్పష్టం చేశారు. దీంతో.. ఈ పదవిలో మంత్రులు జె.గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహల పేర్లు నాడు ప్రముఖంగా విన్పించాయి. అయితే.. వీరిలో రాజనర్సింహ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందని సమాచారం.

నాదెండ్ల లేదా ఉత్తమ్‌కుమార్‌కు స్పీకర్‌గా అవకాశం
ఇక శాసనసభాపతి విషయంలోనూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. సీఎం కిరణ్ మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షపదవి విషయంలోనూ అధిష్ఠానం ఒక ఆలోచనకు వచ్చిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. కాగా.. ఈ పదవిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే విన్పిస్తోంది. ఇక వీటితో పాటు.. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల భర్తీపై కూడా అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే వీలుంది