కష్టజీవులను పట్టించుకోవాలి

వివిధ రంగాలకు చెందిన కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులు , కార్మికులు ఈ బండ చాకిరీ మేము చేయలేమంటూ తెగించి సమ్మెలు కడుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్న మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు ఈ నెల ఒకటి నుంచి సమ్మెకు ఉపక్రమించారు. ఇంకోవైపు ఐకెపి పరిధిలోని కమ్యూనిటీ వలంటీర్స్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (రేగా) క్షేత్ర స్థాయి సహాయకులు, ఐకెపి యానిమేటర్స్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగులు , గ్రామ సేవకులు , వ్యవసాయ మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులు, కంప్యూటర్‌ టీచర్స్‌, యూనివర్సీటీల కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నెల మూడవ వారంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, చలో అసెంబ్లీకి సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్‌ ఇప్పటికే వివిధ రంగాల ఉద్యోగుల, కార్మికులు, విద్యార్థుల ఆందోళనలతో హోరెత్తుతోంది.

కాని ప్రపంచ బ్యాంకు సంస్కరణల మత్తు బాగా తలకెక్కిన ప్రభుత్వం కష్టజీవుల కడగండ్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు పన్నెండు డిమాండ్లతో ఫిబ్రవరి7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని జనవరిలోనే సంబంధిత యాజమాన్యాలకు నోటీసు ఇస్తే చర్చలు, సంప్రదింపుల పేరుతో ఫిబ్రవరి7న సమ్మెను ప్రభుత్వం వాయిదా వేయించింది. ఈ వ్యవధిని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోకుండా నాన్పుడు ధోరణిని అనుసరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్మికుల సహనానికి పరీక్ష పెట్టింది. నిజానికి వారు పెట్టిన డిమాండ్లలో గొంతెమ్మ కోర్కెలేమీ లేవు. వీటిలో చాలా వరకు ప్రభుత్వం ఇంతకుముందు అంగీకరించినవి, ఇప్పటికే జారీ చేసిన జీవోల అమలుకు సంబంధించినవే. కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో మినహాయిస్తున్న పిఎఫ్‌ మొత్తాలను వారి ఖాతాల్లో జమచేయకుండా కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు కార్మికుల పేరున పిఎఫ్‌ ఖాతాలు తెరచి, అందులో జమ చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. దీనిని అమలు చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు అది నెరవేరలేదు. అలాగే జిఓ నెం.3 లేదా కార్మిక గెజిట్‌ నెం.67 ప్రకారం మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల ఫలితంగా విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మరీ ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చూడటం లేదు. మూడు వేలతోనే సరిపెట్టుకోమని ప్రభుత్వం చెప్పడం అమానుషం. అంతేకాదు, 15-20 ఏళ్లుగా బండచాకిరీ చేస్తున్న వీరిని పర్మినెంటు ఉద్యోగాల్లోకి తీసుకోమంటే అదేదో చట్ట విరుద్ధమన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతోంది. ఒకే పనిలో 240 రోజులు వరుసగా పని చేస్తే సదరు తాత్కాలిక ఉద్యోగి సర్వీసును రెగ్యులరైజ్‌ చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలే చెబుతున్నాయి కదా అంటే దీనిపై మాట్లాడదు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు చదువు, నైపుణ్యం తక్కువ కాబట్టి వీరిని తీసుకోలేమని మరో వాదనను తీసుకొస్తున్నది. వారితో ఇంతకాలం చాకిరీ చేయించుకున్నప్పుడు గుర్తుకు రాని అర్హతలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ వాదనలు ముందుకు తెస్తున్నదో సుస్షష్టమే. ప్రభుత్వ వైఖరి వల్ల లాభపడేది కాంట్రాక్టర్లు, ఆయా రంగాల యాజమాన్యాలే. ఏ రాజకీయ నాయకుని ఇంట్లో విందు జరిగినా, ఏ ముఖ్య నాయకుడు పర్యటనకు వచ్చినా రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దేది వీరు. అలాగే నీటి సరఫరా, వీధి దీపాలు, మురుగు కాల్వలు, మరుగు దొడ్లు పరిశుభ్రం ఇలా అన్ని రకాల చాకిరీకి వీరి సేవలు కావాలి. కానీ, వారి శ్రమకు తగిన గుర్తింపు కాదు గదా బతకడానికి అవసరమైన కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతోంది. ఒకే పనికి సమాన వేతనం, కనీస వేతనాల అమలు, వారాంతపు సెలవులు, ఇఎస్‌ఐ వర్తింపు, థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు విధానం రద్దు వంటి డిమాండ్లు చాలా సముచితమైనవి. వీటిని అంగీకరించి అమలులో పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అక్కడి వామపక్ష ప్రభుత్వాలు తాత్కాలిక కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఇతర సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేస్తున్నాయి. థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు పద్ధతి అక్కడ లేదు. అక్కడ సాధ్యమైనవి ఇక్కడ ఎందుకు సాధ్యం కావు? ఇందుకు కావాల్సింది కష్టజీవుల పట్ల చిత్తశుద్ధి. ఈ ప్రభుత్వానికి అదే కొరవడింది.

ప్రపంచబ్యాంకు సంస్కరణలకు తలొగ్గి ప్రతిదీ ప్రయివేటు పరం చేయడంపై చూపే శ్రద్ధ, సమాజంలో తీవ్ర దోపిడీకి గురవుతున్న ఈ కష్టజీవుల పట్ల లేకపోవడం శోచనీయం. సెజ్‌లు, పరిశ్రమల అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, ప్రైవేటు వ్యక్తులకు పెద్దయెత్తున రాయితీలను ఉదారంగా ఇచ్చే ప్రభుత్వం సమాజానికి ఎంతో విలువైన సేవలందిస్తున్న కష్టజీవుల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నది. దీనిని బట్టే పాలకుల వర్గ నైజమేమిటో తెలుస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలి. అలాగే గ్రామ సేవకులు, ఐకెపి యానిమేటర్స్‌, కంప్యూటర్‌ టీచర్స్‌, సెక్యూరిటీ గార్డులు తదితర కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కార్మికులు కూడా తమ న్యాయసమ్మత్తమైన డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేంతవరకు పోరాటం కొనసాగించాలి.
praja shakti sampadhakiyamu

తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ

తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. దాంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. తెలంగాణ అంశంపై చర్చకు పట్టుబడుతూ టీఅర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతిలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. తెలంగాణకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విజయశాంతి, కేసీఆర్‌లకు ఎన్డీయే మద్దతు పలికింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా గొంతు కలిపారు.

దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో సభను స్పీకర్ మరోసారి మధ్యాహ్నాం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.
తాజా వార్తలు
Listings సుప్రీం తీర్పును గౌరవిస్తాం: ప్రధాని Listings లోక్‌సభ రేపటికి వాయిదా
Listings తెలంగాణపై ప్రకటన చేయాలి: అద్వానీ Listings బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Listings ఆమ్లా, డీవిలియర్స్ సెంచరీలు Listings ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి
Listings నాలుగోసారి లోక్‌సభ వాయిదా Listings టీఆర్‌ఎస్ చెబితే రాజీనామాలు చేయాలా?
Listings ముఖ్యమంత్రిని కలిసిన జూపల్లి Listings అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
Listings కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ Listings జూపల్లికి తెలంగాణ మంత్రుల సంఘీభావం
Listings రాజీనామాను స్వాగతించిన కోదండరామ్ Listings సీవీసీ పదవికి థామస్ రాజీనామా
Listings 10న ఇంటర్ పరీక్ష యథాతథం Listings థామస్ నియామకాన్ని కొట్టివేసిన సుప్రీం
Listings లోక్‌సభ 12 గంటల వరకూ వాయిదా Listings కంకిపాడులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
Listings మరోసారి వాయిదా పడ్డ అసెంబ్లీ Listings ‘పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం’

ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి

ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి
హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. అవ
సరం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు సైతం సిద్ధమన్నారు.

ఆత్మసాక్షిగానే రాజీనామా లేఖను రాసినట్ల్లు జూపల్లి తెలిపారు. గవర్నర్ ఫార్మాట్ ప్రకారమే రాజీనామాను పంపామన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న నాటి మాటలకు కట్టుబడే నేడు రాజీనామా చేసినట్లు జూపల్లి తెలిపారు. ఓయూలో విద్యార్థులకు సమక్షంలో తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని ఆనాడే చెప్పానన్నారు. చనిపోయేటప్పడు పదవులతో పోమని జూపల్లి అన్నారు.

శాసనసభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు లేకుండా మంత్రులుగా తాము ఉండటం తగదన్నారు. త్యాగాలకు మారుపేరు తెలంగాణ ప్రజలన్నారు. నోరుపారేసుకునేవారికి ఉద్యమాలు చేసి ఉంటే పోరాట పటిమ తెలుసుండేదన్నారు. తెలంగాణ వాదాన్ని అణగదొక్కేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

దళితిడు సస్తే పతైనికి చోటులేదు

దళితిడు సస్తే పతైనికి చోటులేదు ముక్యమంత్రులు కలిగిన జిల్లా చిత్తూరులో కే వి బి పురం కలత్తూరు దళితవాడలో 800   కుటుంభాలు  జివిస్తున్నవి,యి వాడకు పదేల్లక్రితము స్మశాన వాటిక వుండేది. దానిని కొంత మంది అగ్రకు ల బుకబ్జ దారు లు ఆక్రమించుకున్నారు.అదేమని  అడిగితె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరించున్నారు,అని దళితులు చేబుతన్నారు రెవిన్యు అధికారులకు ఎన్ని మార్లు పిర్యాదు చేశిన పట్టించుకునే నాధుడే లేరని తెలుపుతున్నారు అదే మాదిరిగా పెరిందేశం గ్రామములో ఎయ్యి కుటుంబాలు నివసిస్తున్నై జనాభా ఎక్కువగా వుండి   పక్కన వున్నా బడుగు రైతులు కొంత అక్రమించుకోగా  స్మశానము తక్కువగా వుండి చలటము లేదు స్మశానము చాలఖ పోవడముతో రోడ్డుకు ఇరువైపులా శవాలను పుడ్చిపెడుతున్నారు రోడ్డుపై వావానాలు రోడ్డు కిందికి దిగినప్పుడు శవాలను పుడిచినా సమాధుల మీదుగానే వేల్లుచున్నవి ఆధారము గిరిజన కాలనీకి చెందినా స్మశానాన్ని స్తానిక రాజకీయ నాయకులూ ఆక్రమించుకున్నారu