పేదల పట్ల ప్రభుత్వానికెందుకింత ఏహ్యభావం?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రైతుల కోసం ఎంతో చేస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కొందరయితే, 2011-12 బడ్జెట్‌ను సామాన్యుడి బడ్జెట్‌ (ఆమ్‌ ఆద్మీ)గా పేర్కొన్నారు. అయితే సవివరమైన విశ్లేషణను చూస్తే ఈ బడ్జెట్‌, పరిశ్రమలో, మౌలికవసతుల కల్పనలో, పెట్టు బడుల మార్కెట్లో, సేవల రంగంలో, గృహ నిర్మా ణంలో పెట్టుబడుల అవకాశాలను పెంచే ఉద్దే శంతో రూపొందించినట్లు అర్థమౌతుంది. వ్యవ సాయంపై కొద్దిపాటి సానుకూల ప్రభావం చూపించే అవకాశం వుంది. బడ్జెట్‌లో కేంద్రీకర ణపై అసమతౌల్యం కారణంగా ధరల పెరుగు దలకు ద్రవ్యోల్బణ ధోరణులకు దారితీసి గ్రామీణ పేదలను ఇబ్బందులలోకి నెట్టేయడం జరుగుతుంది.
వ్యవసాయానికి ఎప్పుడూ జరిగేలాగున ఒక విధాయకంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రు 7,860 కోట్లు, తూర్పుప్రాంతంలో హరిత విప్లవానికి రు 400 కోట్లు, పప్పులు, ఆయిల్‌ పాం, పట్టణ శివారు ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, ముతక ధాన్యాలు, పశుదాణా ప్రోటీన్‌ అనుబంధ ఆహారం కోసం నూతన జాతీయ మిషన్‌కు ఒక్కొక్కదానికి రు 300 కోట్లు చొప్పున ఈ కేటాయింపు లున్నాయి. దేశంలోని 6,00,000 రెవెన్యూ గ్రామాలలోని 75 కోట్ల మంది రైతుల ప్రయోజ నాలు నెరవేర్చేందుకు ఈ కేటాయింపులు నామ మాత్రం.
తక్కువ వడ్డీ రేటుపై రైతులను ఆర్థికంగా కలుపుకొని పోవడంపై పెద్ద పెద్ద హామీలైతే యివ్వ డం జరిగింది. పంట రుణాల వడ్డీపై ప్రభుత్వం అందజేసే 3శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయం, రైతులకు చాలావరకు ప్రయోజనకారి అని ఆర్థిక మంత్రి అంటున్నారు. అయితే ఆయనో విషయం తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన సుమారు 5 కోట్ల మంది చెరకు పండించే రైతు లకు ఈ స్కీం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించటం లేదు. చెరకు అన్నది 11 నుండి 18 మాసాల పంట. ఫ్యాక్టరీలు రైతులకు డబ్బును ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. అందువల్ల రైతులు వడ్డీపై ప్రభుత్వం సహాయక పథకం వల్ల ప్రయో జనం పొందేందుకు, ఒక సంవత్సరంలోగా రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అందు వల్ల పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం రెండేళ్ళ వ్యవధినివ్వాలి.
అవకాశాలకు దూరంగా ఉన్నవారికి, అల్పా దాయ గ్రూపులకు భరించగలిగే ఖర్చుపై ఆర్థిక (బ్యాంకింగ్‌) సేవలు అందించే కార్యక్రమాన్ని (సమ్మిళిత ఆర్థిక వృద్ధి) రైతులకు వర్తింపజేసే టప్పుడు జాగ్రత్తగా రూపొందించాలి. ఆ విధంగా రుణగ్రస్తులైన రైతులు తాము పెట్టిన పెట్టుబడు లకు గిట్టుబాటైన రాబడులను పొందుతూ రుణాలను తేలికగా తిరిగి చెల్లించే స్థితిలో ఉండ గలరు. అయితే ఈ దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఇక్కడ రుణగ్రస్తుడైన రైతు రుణ భారం పెరిగిపోయి తనకు, తన కుటుంబానికి జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు సరిపడు రాబడులను సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది అతనిని నిరంతరం అప్పుల ఊబిలోకి నెట్టేసేలా చేసి, అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. అందువల్ల ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య-తనను తన కుటుంబాన్ని నిర్వహించు కొనేలా సరిపడు రాబడులను రైతుకు లభించేలా చూడడం. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) లో ప్రభుత్వం చేసే మెరుగుదలలు సేద్యం చేయడంలో పెరిగిపోతున్న ఉత్పాదకాల ఖర్చులు తట్టుకునేం దుకు, సానుకూలమైన రాబడి పొందేందుకు ఏమాత్రం సరిపడా ఉండడం లేదు.
అయితే ఆర్థికమంత్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అధికాధికంగా రసాయన సేద్యం వల్ల భూసారపరిస్థితి నానాటికీ క్షీణించిపోతోందని ఆయన అంగీకరించారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది. దిగజారిపోతున్న భూసారం, ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు అవరోధంగా వుంది. అంతే గాక, వ్యవసాయంలో సాంప్రదాయక సేంద్రీయ వ్యవసాయ భూసారాన్ని పునరుద్దరించడమేగాక, అదేసాపేక్షకంగా రసాయన సేద్యం కంటే చౌక.
సేంద్రీయ ఉత్పత్తులకు 3వేల కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ పరిమాణం వుంది. దీని ధ్రువీ కరణ వ్యయం హెచ్చుగా ఉండడంతో మనరైతులు ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. విడివిడిగా రైతులకు సేంద్రీయ ధ్రువీకరణ ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తూ, అతని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే అది వివేకవంతమైన చర్య అవుతుంది. రైతులకు ఎరువుల సబ్సిడీని నేరుగా అందజేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ చర్య. అయితే ఎరువుల సబ్సిడీని దారిద్య్రరేఖకు దిగువన జీవించే రైతులకు మాత్రమే అందజేయా లని ప్రభుత్వం యోచిస్తోంది. ఎరువుల సబ్సిడీని రైతులందరికీ అందజేయాలి. సబ్సిడీ పరిమాణం భూకమతాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఈ మొత్తాన్ని వ్యవసాయదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రైతులందరికీ సబ్సిడీ అవసరం వుంది. అందువల్ల భూకమతాల పరిమితిపై దేశమంతటా ఎటువంటి తేడాలు లేకుండా ఎలా అమలు పరచబడిందో సబ్సిడీ కూడా అలాగే అందజేయాలి. సబ్సిడీని ఎలా వినియోగించా లన్నది రైతు స్వేచ్ఛకే వదిలివేయాలి. అది రసా యన సేద్యం కావచ్చు. సేంద్రియ వ్యవసాయం కావచ్చు. ప్రభుత్వం గనుక సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తే సేంద్రీయ ధ్రువీకరణకు సంబంధించిన హెచ్చు ఖర్చును కూడా కలుపుకుంటూ అదనపు సబ్సిడీని అంద జేయాల్సి ఉంటుంది.
ఇంధనం, ఎరువులు, ఆహారం పై ప్రధాన సబ్సిడీలు 2010-11లో ఖర్చు చేసిన దానికంటే (సవరించిన అంచనా) 2011-12 బడ్జెట్‌లో భారీ స్థాయిలో రు 20,000 కోట్ల కోత విధించబడింది. ఆహార సబ్సిడీలో విధించిన రు 27 కోట్ల కోతతో ఆహారభద్రత, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధి అర్థమౌతుంది. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయాల్సి ఉం టుంది. ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ప్రభుత్వ రైతు వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది.
మెగాఫుడ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగయువకులు చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు యూనిట్లను నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధిస్తుంది. ఈ బడ్జెట్‌ అటవీ వ్యవసాయ దారులు, కొండ ప్రాంత వ్యవసాయదారుల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సాగునీటి సమస్యకు అవసరమైన శ్రద్ధ ఈ బడ్జెట్‌లో కనబడలేదు.
వదులుకున్న రెవెన్యూకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం 2010-11లో మొత్తం పన్ను రాయితీలు రు 5,00,000 కోట్లకు పైగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను మినహాయింపులు రు 88,000 కోట్లకు పైగా వున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇలా భారీ ప్రయోజనాలు అందజేస్తున్న పరిస్థితుల్లో రైతుల పట్ల ఎందుకు పిసినారిలా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సంరక్షణ, విద్య, భరించగలిగే రేట్లపై సరిపడు సౌకర్యాలను అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యం పేదల పట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని వెల్లడిస్తోంది.