గ్రామ సేవకుల ధర్నా

మానకొండూర్, ఏప్రిల్ 29 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ సేవకులు ధర్నా చేశారు. మం డల గ్రామ సేవకుల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పిల్లి రాములు, ఉండింటి రాంప్రసాద్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5 వేలు, డీఎ రూ. 50 నుంచి రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న గ్రామ సేవకుల పోస్టులను భర్తీ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

2009 ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా 46 రోజుల సమ్మె చేయగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలతో పాటు డీఎ పెంపు ఆర్థికేతర సమస్యల పరిష్కరిస్తామని చెప్పిన ఆచరించడం లో ప్రభుత్వం విఫలం అయిందన్నా రు. కార్యక్రమంలో దుర్గయ్య, అంజ య్య, కుంభం కుమారస్వామి, కిశోర్, కనకయ్య, కొంరయ్య, కుమారస్వామి, రాములు, మొండయ్య, పాల్గొన్నారు.

తిమ్మాపూర్ : గ్రామ సేవకులు వారి డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. జిల్లా పిలుపుమేరకు గ్రామ సేవకుల సంఘం మండ ల అధ్యక్షుడు కొమురయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రమేశ్, అశోక్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

రామడుగు : మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామసేవ కులు ధర్నాచేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు సిరికొండ అంజయ్య, రమేశ్, మామిడిపెల్లి నర్సయ్య, లేవుటు కనుకయ్య, గునుకొండ లచ్చయ్య, కమలాకర్, రవీందర్, పోచయ్య, ఎల్లయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.